భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!
ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే పాకిస్థాన్ తన నిర్ణయంపై వెనక్కి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఐసీసీ (ICC), పీసీబీ మధ్య ప్రస్తుతం కీలక చర్చలు జరుగుతున్నాయి.
- Author : Gopichand
Date : 08-02-2026 - 6:51 IST
Published By : Hashtagu Telugu Desk
IND vs PAK Boycott: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్తో తలపడేందుకు పాకిస్థాన్ నిరాకరించింది. బంగ్లాదేశ్కు మద్దతుగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పొరుగు దేశం పేర్కొంది. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల పీసీబీ భారీ ఆర్థిక నష్టాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ వివాదంపై స్పందించారు.
బహిష్కరణ నిర్ణయంపై ‘దాదా’ ఏమన్నారంటే?
భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలన్న పీసీబీ నిర్ణయంపై సౌరవ్ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ నిర్ణయం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. “పాకిస్థాన్ ఇప్పటికే తన మ్యాచ్లను శ్రీలంకలో ఆడుతోంది. వరల్డ్ కప్ గెలవాలనే లక్ష్యంతో వచ్చినప్పుడు ప్రతి పాయింట్ చాలా ముఖ్యం. ఇలాంటి సమయంలో పాయింట్లను వదులుకోవడం సరైనది కాదు. పీసీబీ నిర్ణయం ఆశ్చర్యకరంగా ఉంది. కానీ అది వారి బోర్డు అంతర్గత నిర్ణయం కాబట్టి మనం ఏమీ చేయలేం” అని గంగూలీ పేర్కొన్నారు.
Also Read: భారత్-పాక్ మ్యాచ్పై సందిగ్ధత.. బహిష్కరణ నిర్ణయంపై పీసీబీ స్పష్టత!
పాకిస్థాన్ యూ-టర్న్ తీసుకునే అవకాశం!
ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే పాకిస్థాన్ తన నిర్ణయంపై వెనక్కి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఐసీసీ (ICC), పీసీబీ మధ్య ప్రస్తుతం కీలక చర్చలు జరుగుతున్నాయి. ఐసీసీ నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించడంతో ఫిబ్రవరి 15న భారత్తో జరిగే మ్యాచ్లో ఆడేందుకు పాకిస్థాన్ అంగీకరించే అవకాశం ఉంది. శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఈ విషయంలో పునరాలోచించాలని పీసీబీకి లేఖ రాసింది. దీంతో పాకిస్థాన్ బోర్డు ప్రస్తుతం తమ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.