Sehwag: చీఫ్ సెలక్టర్ రేస్.. సెహ్వాగ్ ఏమన్నాడంటే..?
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీలో ఒక స్థానం ఖాళీగా ఉంది. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా టీమిండియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ (Sehwag) పేరు చర్చనీయాంశంగా మారింది.
- By Gopichand Published Date - 01:38 PM, Fri - 23 June 23
Sehwag: ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీలో ఒక స్థానం ఖాళీగా ఉంది. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా టీమిండియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ (Sehwag) పేరు చర్చనీయాంశంగా మారింది. చీఫ్ సెలక్టర్గా బాధ్యతలు చేపట్టాలని బీసీసీఐ సెహ్వాగ్ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ వార్తలన్నింటికీ సెహ్వాగ్ తన ప్రకటనతో ముగింపు పలికాడు.
ఇప్పుడు ఆసియా కప్, ప్రపంచకప్ కు సమయం దగ్గర పడుతుండడంతో బీసీసీఐ కొత్త వ్యక్తి కోసం అన్వేషిస్తోంది. పలువురు మాజీ క్రికెటర్లు ఈ పదవి కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రేసులో ముందున్నట్టు వార్తలు వచ్చాయి. అప్లై చేసుకుంటే అతనే సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అవుతాడన్న అభిప్రాయం వినిపించింది. తాజాగా దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. చీఫ్ సెలక్టర్ పదవి కోసం తనను ఎవరూ సంప్రదించలేదంటూ క్లారిటీ ఇచ్చాడు.
నిజానికి చీఫ్ సెలక్టర్ గా ఉండే వ్యక్తికి బీసీసీఐ ఏడాది కోటి రూపాయలు చెల్లిస్తుంది. సెహ్వాగ్ లాంటి మాజీ క్రికెటర్లు ఎండోర్స్ మెంట్స్ , కామెంట్రీ, ఇతర ఒప్పందాలతో దీని కంటే ఎక్కువగా ఆర్జిస్తున్నారు. దీంతో సెహ్వాగ్ అంతగా ఆసక్తి చూపలేదని బోర్డు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పైగా చీఫ్ సెలక్టర్ పదవి ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. ప్రతీ సిరీస్ కూ జట్టు ఎంపిక కత్తి మీద సామే. గత కొంత కాలంగా భారత జట్టులో ప్రతీ ప్లేస్ కూ కనీసం ముగ్గురు ప్లేయర్లు పోటీ పడుతుండడంతో విపరీతమైన ఒత్తిడి నెలకొంది. కాగా నార్త్ జోన్ అభ్యర్థికి ఛీఫ్ అయ్యే అవకాశం ఉండటంతో ఈ పదవికి సెహ్వాగ్ అప్లై చేసుకుంటాడన్న వార్తలు వచ్చాయి.
Also Read: Virat Kohli: బొద్దుగా ఉండే కోహ్లీ సూపర్ ఫిట్ గా ఎలా మారాడంటే!
ఫిబ్రవరి 2023లో చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేసిన తర్వాత భారత జట్టు సెలక్షన్ కమిటీలో ఖాళీ ఉంది. ఇప్పుడు బీసీసీఐ ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరడం ప్రారంభించింది. ఇదిలా ఉండగా, టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ప్రకటనలో చీఫ్ సెలెక్టర్ కావాలనే ప్రశ్నపై సెహ్వాగ్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి నిరాకరించాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తనకు చీఫ్ సెలక్టర్ పదవికి ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదని ఇటీవల వచ్చిన వార్తలను సెహ్వాగ్ ఖండించాడు. చీఫ్ సెలక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేయడంతో, భారత మాజీ ఆటగాడు శివ సుందర్ దాస్ తాత్కాలికంగా ఆ పదవిని నిర్వహిస్తున్నాడు. దాస్తో పాటు, సెలక్షన్ కమిటీలోని ఇతర సభ్యులు ఎస్ శరత్, సుబ్రోతో బెనర్జీ, సలీల్ అంకోలా ఉన్నారు.
సెలెక్టర్ కావడానికి ఈ అర్హతలు
సెలెక్టర్గా మారడానికి BCCI జారీ చేసిన నోటీసు ప్రకారం.. ఈ పోస్ట్కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి కనీసం 30 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు లేదా 7 టెస్ట్ మ్యాచ్లు లేదా 10 ODIలు ఆడి ఉండాలి. ఇది కాకుండా ఆ వ్యక్తి క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ అయి 5 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి. సెహ్వాగ్ 2015లోనే రిటైర్మెంట్ తీసుకోవడంతో అతనికి అవకాశం ఉంది. అయితే ఈ పదవిపై వీరూ పెద్దగా ఆసక్తిగా లేకపోవడంతో మిగిలిన మాజీ క్రికెటర్లలో ఎవరు వస్తారో చూడాలి.
Related News
Selection Committee: టీమిండియా సెలక్షన్ కమిటీపై మాజీ క్రికెటర్ ఫైర్..!
టీమిండియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ భారత సెలక్షన్ కమిటీపై తీవ్ర ఆరోపణలు చేశారు.