Rohit Sharma: రోహిత్ శర్మ మాట వినకపోతే సనరైజర్స్తో మ్యాచ్ ఓడినట్లే!.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రోల్స్..!
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. మరోసారి హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్గా కనిపించబోతున్నాడు. రోహిత్ (Rohit Sharma) మళ్లీ హార్దిక్ కెప్టెన్సీలో ఆడనున్నాడు.
- Author : Gopichand
Date : 27-03-2024 - 5:28 IST
Published By : Hashtagu Telugu Desk
Rohit Sharma: ఐపీఎల్ 2024లో ఈరోజు ముంబై ఇండియన్స్.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. మరోసారి హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్గా కనిపించబోతున్నాడు. రోహిత్ (Rohit Sharma) మళ్లీ హార్దిక్ కెప్టెన్సీలో ఆడనున్నాడు. తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో చాలా సార్లు రోహిత్ శర్మ హార్దిక్కి కొన్ని సూచనలు చేస్తూ కనిపించాడు. కానీ హార్దిక్ తన మాటలను పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత సోషల్ మీడియాలో యూజర్లు హార్దిక్పై తీవ్ర విమర్శలు చేశారు.
https://twitter.com/bholination/status/1772879717042995445?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1772879717042995445%7Ctwgr%5E6b971b70ed2456b87e360519a3b198f4a87eaad9%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.news24online.com%2Fsports-news%2Fipl-2024-srh-vs-mi-hardik-pandya-rohit-sharma-mumbai-indians%2F643251%2F
హార్దిక్ ఈరోజు రోహిత్ మాటలను ఒప్పుకుంటాడా..?
తొలి మ్యాచ్లో హార్దిక్ కెప్టెన్సీ సమయంలో చాలా చురుగ్గా కనిపించాడు. ఈ సమయంలో పాండ్యా.. రోహిత్ శర్మ ఫీల్డింగ్ను కూడా మారుస్తూ కనిపించాడు. ఇది అభిమానులకు అస్సలు నచ్చలేదు. ఇప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్తో ముంబై ఇండియన్స్ మ్యాచ్కు ముందు ఈ మ్యాచ్లో హార్దిక్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాట వింటాడా అని అభిమానులు ఆలోచిస్తున్నారు. ఈ మ్యాచ్లో హార్దిక్.. రోహిత్ మాట వినకపోతే ఈరోజు మ్యాచ్లో మళ్లీ ఓటమి పాలైనట్టే అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Hyderabad Metro Extends Timings: ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో రైలు సమయం పొడిగింపు..!
తొలి మ్యాచ్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో హార్దిక్ పాండ్యాను ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. హార్దిక్ని చూసి స్టేడియంలో కూర్చున్న ప్రేక్షకులు రోహిత్-రోహిత్ అని కేకలు వేశారు. అంతేకాదు ఈ మ్యాచ్లో రోహిత్ పట్ల హార్దిక్ ప్రవర్తించిన తీరుపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత హార్దిక్పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ జరిగింది. హార్దిక్ కూడా తొలి మ్యాచ్లోనే ఫ్లాప్ అయ్యాడు. బౌలింగ్ చేస్తున్నప్పుడు పాండ్యా మొదటి మ్యాచ్లో మూడు ఓవర్లలో 30 పరుగులు ఇచ్చాడు. ఎటువంటి వికెట్ తీసుకోలేదు. దీని తర్వాత బ్యాటింగ్లో కూడా హార్దిక్ 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
We’re now on WhatsApp : Click to Join