India Squad SL Series: శ్రీలంకతో టీ20, ODI సిరీస్.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
శ్రీలంక (Srilanka)తో జనవరి 3, 2023 నుండి ప్రారంభమయ్యే మూడు T20, మూడు ODI సిరీస్ల కోసం భారత (India) జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీ20లో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. అదే సమయంలో వన్డే సిరీస్లో రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నాడు. రెండు సిరీస్లలో రిషబ్ పంత్ ఎంపిక కాలేదు.
- By Gopichand Published Date - 06:47 AM, Wed - 28 December 22
శ్రీలంక (Srilanka)తో జనవరి 3, 2023 నుండి ప్రారంభమయ్యే మూడు T20, మూడు ODI సిరీస్ల కోసం భారత (India) జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీ20లో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. అదే సమయంలో వన్డే సిరీస్లో రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నాడు. రెండు సిరీస్లలో రిషబ్ పంత్ ఎంపిక కాలేదు. బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు అతను జట్టు నుండి వైదొలిగాడు. వన్డే సిరీస్లో ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు. ఇషాన్ కిషన్, సంజూ శాంసన్లు టీ20లో వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు.
విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్లకు టీ20 సిరీస్ నుండి విశ్రాంతి ఇచ్చారు. ఇద్దరూ వన్డే సిరీస్లో ఆడనున్నారు. టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ వన్డే జట్టులో లేడు. టీ20లో రితురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా ఎంపికయ్యారు. సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్లు రెండు సిరీస్లలో ఎంపికయ్యారు. కుల్దీప్ యాదవ్ వన్డేలకు, హర్షల్ పటేల్ టీ20లకు ఎంపికయ్యారు. ఐపీఎల్ 2023 వేలంలో రూ.6 కోట్లకు అమ్ముడుపోయిన శివమ్ మావి టీ20కి ఎంపికయ్యాడు. 5.5 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన ముఖేష్ కుమార్ కూడా ఎంపికయ్యారు.
Also Read: దక్షిణ కొరియాలో మెదడును తినే ఇన్ఫెక్షన్..ఒకరు మృతి
వన్డే సిరీస్కు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సుందర్, చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, షమీ, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్లకు చోటు కల్పించింది. జనవరి 10 నుంచి వన్డేసిరీస్ మొదలుకానుంది.
టీ20 సిరీస్కు భారత జట్టు: హార్దిక్పాండ్యా(కెప్టెన్), సూర్యకుమార్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్, దీపక్హుడా, రాహుల్ త్రిపాఠీ, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్పటేల్, అర్ష్దీప్సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివం మావి, ముకేశ్ కుమార్. కాగా.. జనవరి 3,5,7న టీ20లు జరుగుతాయి.
Related News
Matthew Hayden: టీమిండియాకు సలహా ఇచ్చిన ఆసీస్ మాజీ ఆటగాడు.. నంబర్ 4లో రోహిత్ బ్యాటింగ్కు రావాలని..!
: IPL చివరి దశలో ఉంది. ఇప్పుడు ఈ టోర్నమెంట్లో పాల్గొనే ఆటగాళ్లు, వారి జాతీయ జట్లు రాబోయే T20 ప్రపంచ కప్ 2024పై దృష్టి సారిస్తున్నాయి.