WTC Final Squad: సర్వం సిద్ధం.. ఇంగ్లండ్ చేరుకున్న టీమిండియా స్టార్ ఆటగాళ్లు
జూన్ 7 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య WTC ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత జట్టు (WTC Final Squad) ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకుంది. అదే సమయంలో గురువారం ప్రపంచ నంబర్-1 టెస్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భారత జట్టుతో కలిశాడు.
- By Gopichand Published Date - 08:58 AM, Fri - 2 June 23
WTC Final Squad: జూన్ 7 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య WTC ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత జట్టు (WTC Final Squad) ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకుంది. అదే సమయంలో గురువారం ప్రపంచ నంబర్-1 టెస్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భారత జట్టుతో కలిశాడు. జట్టుతో పాటు ప్రాక్టీస్ సెషన్లో కూడా పాల్గొన్నాడు. జడేజాతో పాటు శుభమన్ గిల్, అజింక్యా రహానె కూడా ఇంగ్లండ్ చేరుకున్నారు.
ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆటగాళ్లు ఇంగ్లండ్ చేరుకోవడం గమనార్హం. ఐపీఎల్ క్వాలిఫయర్స్కు ముందే భారత కోచింగ్ స్టాఫ్తో పాటు జట్టులోని కొందరు ఆటగాళ్లు ఇంగ్లండ్ చేరుకున్నారు. అదే సమయంలో క్వాలిఫయర్ మ్యాచ్లు ముగిసిన తర్వాత భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీతో పాటు పుజారా జట్టుతో కలిశారు. అదే సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రెండు రోజుల క్రితం ఇంగ్లండ్ చేరుకున్నాడు.
The wait is over. Hello guys, welcome back!😎 #TeamIndia 💪💪@imjadeja | @ShubmanGill | @ajinkyarahane88 | @surya_14kumar pic.twitter.com/UrVtNwAGfW
— BCCI (@BCCI) June 1, 2023
Also Read: Shubman Gill: స్పైడర్ మ్యాన్ కి డబ్బింగ్ చెప్పిన శుభ్మన్ గిల్
రవీంద్ర జడేజా, శుభ్మన్ గిల్ ఇంగ్లండ్ చేరుకున్నారు
ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా గురువారం ఇంగ్లాండ్ చేరుకున్నాడు. రవీంద్ర జడేజా ఇంగ్లండ్ చేరుకున్న సందర్భంగా బీసీసీఐ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేసింది. రవీంద్ర జడేజాతో పాటు శుభ్మన్ గిల్, అజింక్యా రహానే కూడా జట్టులోకి వచ్చారు. అలాగే అందరూ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు.
చెన్నై విజయంలో జడేజాది కీలకపాత్ర
ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ను 5 వికెట్ల తేడాతో ఓడించి చెన్నై ఐదో టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. చెన్నై విజయంలో రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. జడేజా తొలుత శుభ్మన్ గిల్ వికెట్ తీశాడు. ఆ తర్వాత చివరి ఓవర్లో రెండు బంతుల్లో 10 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే జడేజా ఇప్పుడు WTC ఫైనల్స్లో బలమైన ప్రదర్శనపై దృష్టి సారించాడు.
Related News
CSK vs KKR: తిప్పేసిన జడేజా… చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు బాట
ఐపీఎల్ 17వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ జోరుకు బ్రేక్ వేస్తూ 7 వికెట్ల తేడాతో మూడో విజయాన్ని అందుకుంది. బౌలింగ్ లో రవీంద్ర జడేజా స్పిన్ మ్యాజిక్ , తుషార్ పాండే స్పెల్ చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాయి.