Kohli- Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు అందుకే విశ్రాంతి.. కోచ్ రాహుల్ ద్రవిడ్ క్లారిటీ..!
ప్రపంచకప్కు ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Kohli- Rohit)లకు విశ్రాంతినిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రశ్నార్థకమైంది.
- By Gopichand Published Date - 06:56 AM, Fri - 22 September 23
Kohli- Rohit: ప్రపంచకప్కు ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Kohli- Rohit)లకు విశ్రాంతినిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. వన్డే సిరీస్ ప్రారంభానికి ఒక రోజు ముందు కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రపంచకప్ దృష్ట్యా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు విశ్రాంతినిచ్చామని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. ఆస్ట్రేలియాతో జరిగే తొలి రెండు వన్డేల్లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు జట్టులో ఉండరు. అయితే మూడో వన్డేలో వీరిద్దరూ తిరిగి జట్టులోకి రావాల్సి ఉంది.
ఈ విషయంపై రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. ఆటగాళ్లతో మాట్లాడిన తర్వాతే విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించాం. ప్రపంచకప్కు ముందు వీరిద్దరూ శారీరకంగా, మానసికంగా పూర్తిగా దృఢంగా ఉండాలని జట్టు కోరుతోందని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. అంతకుముందు, గత నెలలో వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి చివరి రెండు మ్యాచ్ల నుండి విశ్రాంతి ఇచ్చారు. అయితే, ఆసియా కప్లో కెప్టెన్ రోహిత్ శర్మ అన్ని మ్యాచ్ల సమయంలో ప్లేయింగ్ 11లో భాగమయ్యాడు. కానీ ఫైనల్కు ముందు బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు.
Also Read: IND vs AUS 2023: ఆస్ట్రేలియాతో టీమిండియా ప్లేయింగ్ 11
టీ20లకు దూరంగా విరాట్, రోహిత్
విరాట్, రోహిత్ ఆటగాళ్లు ప్రపంచకప్కు ముందు తక్కువ వన్డే మ్యాచ్లు ఆడుతున్నారు. విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే ఫిటెస్ట్ క్రికెటర్గా పేరొందాడు. అయితే విరాట్ చాలా మ్యాచ్లకు గైర్హాజరు కావడం అభిమానులకు అర్థం కావడం లేదు. గత ఏడాది T20 ప్రపంచ కప్ తర్వాత నుండి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్లో టీమ్ ఇండియా తరపున ఒక్కసారి కూడా మైదానంలోకి రాలేదు. టీ20 ఇంటర్నేషనల్లో ఈ ఇద్దరు ఆటగాళ్లకు మరోసారి అవకాశం దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ ఏడాది జరిగే ప్రపంచకప్ తర్వాత క్రికెట్ కు దూరం అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం రోహిత్ శర్మ వయస్సు 36 సంవత్సరాలు. హిట్ మ్యాన్ ఫిట్నెస్ను పరిగణనలోకి తీసుకుంటే రోహిత్ తదుపరి ప్రపంచకప్ వరకు జట్టులో ఉండటం కష్టమే. మరోవైపు విరాట్ కోహ్లి కూడా ఈ ఏడాది నవంబర్ 5వ తేదీతో 35 ఏళ్లు పూర్తి చేసుకోనున్నాడు. కోహ్లీ కూడా తదుపరి ప్రపంచకప్ వరకు జట్టులో ఉండటం కష్టమే. ఈ ప్రపంచ కప్ తర్వాత ఈ ఇద్దరి స్టార్ ఆటగాళ్ల ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి మరి..!
Related News
Kohli Strike Rate: కోహ్లీపై విమర్శకులకు ఇచ్చి పడేసిన ఏబీడీ
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తన ఆట తీరుతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. టీ20 ఫార్మాట్కు తన స్ట్రైక్రేట్ సరిపోదని కొందరు మాజీ ఆటగాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి కోహ్లీ ఈ సీజన్ ఐపీఎల్ లో ఇప్పటికే 500 పరుగులు చేశాడు. బెంగళూరు భారీ స్కోరు చేయడంలోనూ కీలకపాత్ర పోషించాడు