Rohit Sharma: రోహిత్ శర్మ కొంపముంచుతున్న బ్యాడ్ ఫామ్.. రోహిత్ స్థానంలో రహానే..?
బ్యాడ్ ఫామ్తో సతమతమవుతున్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు వెస్టిండీస్ టూర్ నుంచి విశ్రాంతి ఇవ్వవచ్చు.
- Author : Gopichand
Date : 17-06-2023 - 9:10 IST
Published By : Hashtagu Telugu Desk
Rohit Sharma: బ్యాడ్ ఫామ్తో సతమతమవుతున్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు వెస్టిండీస్ టూర్ నుంచి విశ్రాంతి ఇవ్వవచ్చు. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టును జూన్ 27న ప్రకటించనున్నట్లు సమాచారం. వెస్టిండీస్లో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంది. భారత్ వెస్టిండీస్ పర్యటన జులై 12న తొలి టెస్టుతో ప్రారంభం కానుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ టూర్లో కేవలం టెస్ట్ సిరీస్లు మాత్రమే ఆడతాడని, వైట్ బాల్ సిరీస్లో పాల్గొనడం లేదని గతంలో చాలా నివేదికలలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు షాకింగ్ రిపోర్ట్ ఒకటి తెరపైకి వచ్చింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. వన్డే, టీ20 సిరీస్లతో పాటు టెస్టు సిరీస్లో కూడా రోహిత్ శర్మ పాల్గొనడం లేదు. అయితే సెలక్టర్లు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు రోహిత్తో మాట్లాడతారు. IPL 2023, ఇంగ్లాండ్లో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లతో రోహిత్ కొంచెం అలసిపోయాడు. ఇప్పుడు వెస్టిండీస్ పర్యటనలో అతనికి విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు ఆలోచిస్తున్నారు.
Also Read: Ahmedabad Pitch: నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్లు ఆడటం మాకు ఇష్టం లేదు: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
బ్యాడ్ ఫామ్తో రోహిత్ ఇబ్బంది
ఐపీఎల్ 2023లో 16 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ 20.75 సగటుతో 332 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ సమయంలో రోహిత్ బ్యాట్ నుండి కేవలం రెండు అర్ధ సెంచరీలు మాత్రమే వచ్చాయి. అదే సమయంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో రోహిత్ 15, 43 పరుగులు మాత్రమే చేయగలడు.
టెస్టు సిరీస్కు రహానే కెప్టెన్గా వ్యవహరించనున్నాడు
వెస్టిండీస్తో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో రోహిత్ శర్మ స్థానంలో అజింక్య రహానే టీమ్ ఇండియా కెప్టెన్గా ఉంటాడని సమాచారం. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ నుంచి సుమారు 18 నెలల తర్వాత రహానే టీమ్ ఇండియాకు తిరిగి వచ్చాడు. ఫైనల్లో రహానే 89, 46 పరుగులు చేశాడు.