MS Dhoni Invests: మరో వ్యాపార రంగంలోకి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ..!
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni Invests) భారతదేశం అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు.
- By Gopichand Published Date - 08:56 AM, Tue - 16 July 24

MS Dhoni Invests: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni Invests) భారతదేశం అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు. ప్రపంచకప్లో టీమిండియాకు, ఐపీఎల్లో సీఎస్కేకు ఎన్నో టైటిళ్లు అందించాడు. ధోనీ అనేక వ్యాపారాలలో పెట్టుబడి కూడా పెట్టాడు. క్రీడలు, హోటళ్ళు, ఏరోస్పేస్, పాఠశాలలు, సేంద్రీయ వ్యవసాయం, వినోదంతో సహా అనేక స్టార్టప్లలో పెట్టుబడి పెట్టాడు. ధోనీ క్రికెట్ నుండి వ్యాపార రంగం వరకు విజయవంతమైన ఇన్నింగ్స్లు ఆడుతూ కనిపిస్తాడు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) రంగంలో తన ఉనికిని చాటుకునేందుకు సిద్ధమయ్యాడు.
బ్లూస్మార్ట్లో పెట్టుబడి
MS ధోని EV స్టార్టప్ బ్లూస్మార్ట్లో రూ. 200 కోట్ల నిధుల రౌండ్లో పాల్గొన్నాడు. స్టార్టప్లో పెట్టుబడులు పెట్టే పెట్టుబడిదారులలో ఆయన ఒకరు. బ్లూస్మార్ట్ 2019లో ప్రారంభమైంది. ఇది Ola-Uber వంటి క్యాబ్ సేవలను అందిస్తుంది. ఇది కేవలం ఎలక్ట్రిక్ వెహికల్ (EV)పై ఆధారపడి ఉంది. విశేషమేమిటంటే ఆటోమొబైల్ రంగంలో ధోనీకి ఇది రెండో పెట్టుబడి. అంతకుముందు ఎంఎస్ ధోనీ.. సైకిల్ సంబంధిత స్టార్టప్ ఈమోటోరాడ్, యూజ్డ్ కార్ స్టార్టప్ కార్స్ 24లో పెట్టుబడి పెట్టాడు.
Also Read: Ishan Kishan: ప్రధాన కోచ్ గంభీర్ సూచనలతో ఇషాన్ కిషన్కు జట్టులో చోటు దక్కుతుందా?
550 కోట్ల వార్షిక ఆదాయం
ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, బెంగళూరులో బ్లూస్మార్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. జూన్ 2024లో కంపెనీ దుబాయ్లో ప్రీమియం ఆల్-ఎలక్ట్రిక్ లిమోసిన్ను ప్రారంభించింది. కంపెనీ వ్యవస్థాపకులు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీ, పునీత్ కె గోయల్. బ్లూస్మార్ట్ ఇటీవలే వార్షిక ఆదాయ రన్ రేట్ రూ.550 కోట్లను దాటింది.
ధోనీ ఐపీఎల్ ఆడతాడా?
ఎంఎస్ ధోని వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడనున్నాడనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై ధోనీ మౌనం వహిస్తున్నాడు. అయితే వచ్చే ఏడాది ధోనీ ఐపీఎల్లో కచ్చితంగా ఆడతాడని అతని సహచరులు మతిషా పతిరనా, డారిల్ మిచెల్ చెబుతున్నారు. ఇటీవల ధోనీ మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. జూన్ 1న ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో అతని శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join.