T20 World Cup 2022: ఆస్ట్రేలియా – ఇంగ్లండ్ మ్యాచ్ రద్దు.. కారణమిదే..!
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న T20 ప్రపంచకప్ టోర్నమెంట్కు వరుణుడు అడ్డంకిగా మారాడు.
- By Gopichand Published Date - 05:02 PM, Fri - 28 October 22
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న T20 ప్రపంచకప్ టోర్నమెంట్కు వరుణుడు అడ్డంకిగా మారాడు. సూపర్ -12 పోరులో భాగంగా ఈరోజు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరగాల్సిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ రెండు జట్లు ఉన్న గ్రూప్-1లో ఇంగ్లండ్ 2వ స్థానంలో, ఆస్ట్రేలియా 4వ స్థానంలో ఉన్నాయి. సూపర్-12లో ఇప్పటికే మూడు మ్యాచ్లు వర్షం వల్ల రద్దయ్యాయి.
మ్యాచ్ రద్దు కావడంతో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు చెరో పాయింట్ ను దక్కించుకున్నాయి. తడి, అసురక్షిత అవుట్ఫీల్డ్ కారణంగా MCGలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. రెండు జట్లూ తమ తొలి రెండు గేమ్లలో ఒక్కో విజయం, ఓటమితో ఉన్నాయి. మెల్బోర్న్లో గత రెండు రోజులుగా కుండపోత వర్షం కురుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్ కూడా టాస్ పడకుండానే రద్దు చేశారు. రెండు రోజుల కిందట కూడా న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం ప్రభావంతో రద్దయింది. ఆఫ్ఘనిస్థాన్ ఇప్పటిదాకా రెండు మ్యాచ్ లను వరుణుడికి సమర్పించింది. దక్షిణాఫ్రికా-జింబాబ్వే మ్యాచ్ వర్షం కారణంగా ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. ఐర్లాండ్ తో మ్యాచ్ లో ఇంగ్లండ్ వర్షం కారణంగా డక్ వర్త్ పద్ధతిలో 5 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Related News
David Warner: కొంప ముంచుతున్న ఐపీఎల్
అశ్విన్తో జరిపిన చిట్ చాట్ లో వార్నర్ పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. భారత గడ్డపై ఐపీఎల్లో ఆడడం మాకు చాలా హెల్ప్ అవుతుందని చెప్పాడు . ఇక్కడ పిచ్ మరియు ఫీల్డ్ను బాగా అర్థం చేసుకోగలుగుతున్నాం. నిజానికి ఆస్ట్రేలియాలో కూడా నరేంద్ర మోడీ స్టేడియం లాంటి మైదానం ఉంది. మోడీ స్టేడియంలో ఆడుతున్నంతసేపు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆడుతున్నామనే ఫీలింగ్ వస్తుందని