Manika Batra: పారిస్ ఒలింపిక్స్లో చరిత్ర సృష్టించిన మనికా బాత్రా.. ఎవరు ఈమె..?
పారిస్ ఒలింపిక్స్-2024లో మనికా బాత్రా చరిత్ర సృష్టించి 16వ రౌండ్లోకి ప్రవేశించింది. టేబుల్ టెన్నిస్ సింగిల్స్ 32 రౌండ్లో ఫ్రాన్స్కు చెందిన ప్రితికా పవాడ్ను ఓడించి మణికా తదుపరి రౌండ్లోకి ప్రవేశించింది.
- By Gopichand Published Date - 10:14 AM, Tue - 30 July 24

Manika Batra: 2024 పారిస్ ఒలింపిక్స్లో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బాత్రా (Manika Batra) చరిత్ర సృష్టించింది. ఒలంపిక్స్లో టేబుల్ టెన్నిస్ ఈవెంట్లో క్వార్టర్ఫైనల్కు చేరిన తొలి క్రీడాకారిణిగా మనికా బాత్రా నిలిచింది. ఫ్రాన్స్ క్రీడాకారిణి ప్రితికా పవాడ్ను వరుస సెట్లలో ఓడించి ఆమె ఈ ఘనత సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత సంతతికి చెందిన ప్రితికా 12వ ర్యాంక్లో.. మనిక 18వ ర్యాంక్లో ఉన్నారు. అయితే భారత క్రీడాకారిణి మనికా బాత్రా ఈ మ్యాచ్లో మొదటి నుండి చివరి వరకు తన ఆధిపత్యాన్ని కొనసాగించి క్వార్టర్ ఫైనల్ చేరాలనే తన కలను నెరవేర్చుకుంది.
మనికా అద్భుత ప్రదర్శనతో టేబుల్ టెన్నిస్ పోటీల్లో భారత్ పతకంపై ఆశలు పెరిగాయి. ఇదిలా ఉంటే మనికా బత్రా ఎవరు..? ఆమె ఒలింపిక్స్ వరకు ఎలా ప్రయాణించిందో తెలుసుకుందాం.
మనికా బత్రా ఎవరు?
మనికా బాత్రా 1995 జూన్ 14న ఢిల్లీలో జన్మించారు. ఆమె 4 సంవత్సరాల వయస్సులో టేబుల్ టెన్నిస్ ఆడటం ప్రారంభించింది. ఆమె పాఠశాలలో, ఇంట్లో క్రీడలను అభ్యసించింది. మనికా కేవలం 7 సంవత్సరాల వయస్సులో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో అండర్ -8 విభాగంలో విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఢిల్లీ అత్యుత్తమ క్రీడాకారిణిగా నిలిచింది. మనికా ఇక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించాక వెనుదిరిగి చూడలేదు.
Also Read: Manchu Vishnu -Meena : మంచు విష్ణుకు సపోర్ట్ చేస్తున్న మీనా.. థ్యాంక్స్ చెప్తూ స్పెషల్ పోస్ట్..
టేబుల్ టెన్నిస్లో చరిత్ర సృష్టించింది
పారిస్ ఒలింపిక్స్-2024లో మనికా బాత్రా చరిత్ర సృష్టించి 16వ రౌండ్లోకి ప్రవేశించింది. టేబుల్ టెన్నిస్ సింగిల్స్ 32 రౌండ్లో ఫ్రాన్స్కు చెందిన ప్రితికా పవాడ్ను ఓడించి మణికా తదుపరి రౌండ్లోకి ప్రవేశించింది. టేబుల్ టెన్నిస్లో 16వ రౌండ్లోకి ప్రవేశించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా మనికా నిలిచింది. మ్యాచ్ 37వ నిమిషంలో 11-9, 11-6, 11-9, 11-7 తేడాతో ఫ్రెంచ్ ప్లేయర్పై మనికా విజయం సాధించింది. ఇప్పుడు మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ఫైనల్లో 8వ సీడ్ జపాన్ ప్లేయర్ మియు హిరానో లేదా చైనా ప్లేయర్ ఝు చెంగ్జుతో మనికా తలపడనుంది.
We’re now on WhatsApp. Click to Join.
టోక్యో ఒలింపిక్స్లోనూ చరిత్ర సృష్టించింది
కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు స్వర్ణ పతకాన్ని అందించిన మనికా బాత్రా.. టోక్యో ఒలింపిక్స్-2020లో కూడా మహిళల సింగిల్స్లో 32వ రౌండ్లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. భారత్లో ఈ ఘనత సాధించిన తొలి మహిళా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా నిలిచింది. ఇది కాకుండా గోల్డ్ కోస్ట్-2018లో 2 స్వర్ణాలు సహా 4 పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. మనికా బాత్రా మూడోసారి ఒలింపిక్స్లో పాల్గొంటోంది.
21 ఏళ్ల వయసులో ఒలింపిక్స్లోకి ప్రవేశించింది
మనికా బాత్రా కేవలం 21 ఏళ్ల వయసులో ఒలింపిక్స్లో అరంగేట్రం చేసింది. అయితే రియో ఒలింపిక్స్-2016 తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ఈ ఓటమి తర్వాత మరుసటి సంవత్సరం 2017లో ఆమె ITTF ర్యాంకింగ్స్లో ప్రపంచంలో 104వ స్థానానికి చేరుకుంది. ఇది భారతదేశంలోని ఏ మహిళా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి సాధించిన అత్యధిక ర్యాంకింగ్గా నిలిచింది.