Jay Shah: డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు జై షాకు కొత్త బాధ్యత!
గత సంవత్సరం ఆట గురించి చర్చించడానికి 100 మంది క్రికెటర్లు హాజరైన ఈవెంట్ను షా హాజరుకాలేదు.
- By Gopichand Published Date - 09:44 AM, Fri - 24 January 25

Jay Shah: మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ (MCC) కొత్త వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ అడ్వైజరీ బోర్డులో బీసీసీఐ మాజీ కార్యదర్శి, ఐసీసీ అధ్యక్షుడు జై షా (Jay Shah) చేరారు. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర అధ్యక్షత వహించే వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ బోర్డు 13 మంది వ్యవస్థాపక సభ్యులలో జై షా ఒకరు. ఈ సంవత్సరం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్కు ముందు జూన్ 7, 8 తేదీల్లో వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ లార్డ్స్లో జరగనుంది.
గత సంవత్సరం ఆట గురించి చర్చించడానికి 100 మంది క్రికెటర్లు హాజరైన ఈవెంట్ను షా హాజరుకాలేదు. ఇతర వ్యవస్థాపక సభ్యులలో సౌరవ్ గంగూలీ, గ్రేమ్ స్మిత్, ఆండ్రూ స్ట్రాస్, ఇంగ్లాండ్ మహిళల జట్టు కెప్టెన్ హీథర్ నైట్ ఉన్నారు. వరల్డ్ క్రికెట్ కమిటీ ఇప్పుడు వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ బోర్డ్ ద్వారా భర్తీ చేయనుంది.
Also Read: Earthquake Tremors: కంపించిన భూమి.. ఇళ్ల పైకప్పులు, గోడలకు పగుళ్లు!
MCC చైర్మన్ ప్రకటన
మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ (MCC) చైర్మన్ మార్క్ నికోల్స్ మాట్లాడుతూ.. వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ అడ్వైజరీ బోర్డు ఏర్పాటులో ఒక ముఖ్యమైన చర్య తీసుకోబడింది. మేము మా ఆటకు సంబంధించిన అనేక విభిన్న రంగాలలో క్రికెట్లోని అత్యుత్తమ సమూహాన్ని సమీకరించాము. ఈ అనుభవజ్ఞులైన సమూహంతో కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. గ్లోబల్ స్పోర్ట్స్ ప్రయోజనం కోసం సమిష్టిగా ఏమి సాధించగలమో దాని గురించి నేను సంతోషిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు.
వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ అడ్వైజరీ బోర్డు వ్యవస్థాపక సభ్యులు
- కుమార్ సంగక్కర (ఛైర్మన్), అనురాగ్ దహియా (ICC చీఫ్ కమర్షియల్ ఆఫీసర్), క్రిస్ డెహ్రింగ్ (CWI CEO), సౌరవ్ గంగూలీ, సంజోగ్ గుప్తా (జియోస్టార్ CEO – స్పోర్ట్స్), మెల్ జోన్స్, హీథర్ నైట్, ట్రూడీ లిండ్బ్లాడ్ (క్రికెట్ స్కాట్లాండ్ CEO), హీత్ మిల్స్ (వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్), ఇంతియాజ్ పటేల్ (మాజీ సూపర్స్పోర్ట్ ప్రెసిడెంట్), జై షా, గ్రేమ్ స్మిత్, ఆండ్రూ స్ట్రాస్.