IND vs SL 3rd ODI: వన్డే క్రికెట్ లో చరిత్ర సృష్టించిన టీమిండియా.. లంకతో సిరీస్ క్లీన్స్వీప్
తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో భారత్ 317 పరుగుల తేడాతో శ్రీలంక (IND vs SL)ను ఓడించింది. వన్డే చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2008లో ఐర్లాండ్పై 290 పరుగుల తేడాతో విజయం సాధించింది.
- By Gopichand Published Date - 08:16 PM, Sun - 15 January 23
తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో భారత్ 317 పరుగుల తేడాతో శ్రీలంక (IND vs SL)ను ఓడించింది. వన్డే చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2008లో ఐర్లాండ్పై 290 పరుగుల తేడాతో విజయం సాధించింది. అదే సమయంలో 2007లో బెర్ముడాపై సాధించిన 257 పరుగుల విజయమే భారత జట్టు మునుపటి రికార్డు. శ్రీలంకతో తిరువనంతపురం వేదికగా జరిగిన చివరి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. అటు బ్యాట్స్మెన్స్, ఇటు బౌలర్స్ ఇద్దరూ ఇరగదీయడంతో లంక ఆటగాళ్లు చేతులెత్తేశారు. 391 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేక కేవలం 22 ఓవర్లలో 73 పరుగులు మాత్రమే చేసి ఓటమి మూటగట్టుకున్నారు. సిరాజ్ 4, కుల్దీప్ 2, షమీ 2 వికెట్లు తీశారు. దీంతో భారత్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది.
Also Read: India vs Sri Lanka: శతకొట్టిన కోహ్లీ, గిల్.. లంక ముందు భారీ లక్ష్యం..!
తిరువనంతపురం వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా చరిత్ర సృష్టించింది. మూడో వన్డేలో టీమిండియా 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన రికార్డుగా ఇప్పుడు భారత్ పేరు నిలిచింది. విరాట్ కోహ్లి అజేయంగా 166, శుభ్మన్ గిల్ 116 పరుగులతో తొలి ఆట ముగియడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసింది. 391 లక్ష్యంతో శ్రీలంక జట్టు కేవలం 73 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక జట్టు 22 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. గాయం కారణంగా అషెన్ బండార మైదానంలోకి రాలేకపోయాడు. దీంతో టీమిండియా 317 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ తరఫున మహ్మద్ సిరాజ్ అత్యధికంగా నాలుగు వికెట్లు, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు.
𝗕𝗶𝗴𝗴𝗲𝘀𝘁 𝘄𝗶𝗻 𝗯𝘆 𝗺𝗮𝗿𝗴𝗶𝗻 𝗼𝗳 𝗿𝘂𝗻𝘀 𝗶𝗻 𝗢𝗗𝗜𝘀!#TeamIndia register a comprehensive victory by 3️⃣1️⃣7️⃣ runs and seal the @mastercardindia #INDvSL ODI series 3️⃣-0️⃣ 👏👏
Scorecard ▶️ https://t.co/q4nA9Ff9Q2……… pic.twitter.com/FYpWkPLPJA
— BCCI (@BCCI) January 15, 2023
శ్రీలంకపై కూడా భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. వన్డే సిరీస్లో శ్రీలంకపై టీమిండియా నాలుగోసారి క్లీన్స్వీప్ చేసింది. తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో, రెండో వన్డేలో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Tags
Related News
T20 World Cup: టీ20 ప్రపంచ కప్లో విరాట్ కోహ్లీ ఓపెనర్గా రావాలి: గంగూలీ
వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ లో విరాట్ కోహ్లీ.. భారత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభించటం అవసరమని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మీడియాకు తెలిపారు.