HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Khana Nahi Khaya Virat Kohli Trolls Delhi Crowd Starts Cheering Competition Between Stands

Virat Kohli Trolls Delhi Crowd: ఎవరూ తిని రాలేదా? ఫ్యాన్స్ లో జోష్ నింపిన కోహ్లీ

దాదాపు 13 ఏళ్ళ తర్వాత కోహ్లీ దేశవాళీ క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. జాతీయ జట్టు మ్యాచ్ లు లేనప్పుడు ప్రతీ ప్లేయర్ దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ చెప్పడంతో పలువురు స్టార్ క్రికెటర్లతో పాటు విరాట్ కూడా బరిలోకి దిగాడు.

  • By Naresh Kumar Published Date - 08:08 AM, Fri - 31 January 25
  • daily-hunt
Kohli Retirement Post
Kohli Retirement Post

Virat Kohli Trolls Delhi Crowd: అభిమానులను హుషారుపరచడంలో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli Trolls Delhi Crowd) ప్రత్యేకతే వేరు.. కేవలం తన బ్యాటింగ్ తోనే కాదు తన మాటలతోనూ కోహ్లీ వారిలో జోష్ నింపుతుంటాడు. తాజాగా రంజీ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీని చూసేందుకు 15వేల మందికి పైగా ఫ్యాన్స్ అరుణ్ జైట్లీ స్టేడియానికి పోటెత్తారు. కోహ్లీ నామస్మరణతో స్టేడియం హోరెత్తిపోయింది. తనపై చూపించిన అభిమానానికి విరాట్ సైతం ముగ్ధుడైపోయాడు. వారికి కృతజ్ఞతలు చెబుతూ జోష్ నింపాడు. ఓవర్ల మధ్యలో ప్రతీ స్టాండ్ వైపు చూస్తూ వారిని ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాడు. కొన్ని స్టాండ్స్ లో ఫ్యాన్స్ అరవకపోతే వారిని టీజ్ చేశాడు. ఏం తిని రాలేదా అంటూ వారిని సరదాగా రెచ్చగొట్టాడు. దీంతో స్టాండ్స్ లో ప్రేక్షకులు పోటాపోటీగా ఢిల్లీ టీమ్ కు, కోహ్లీకి ఛీర్స్ చెబుతూనే ఉన్నారు. ఒకమాటలో చెప్పాలంటే స్టాండ్స్ మధ్య అరుపుల పోటీ ఉండేలా కోహ్లీ వారిని ఎంకరేజ్ చేశాడు.

దాదాపు 13 ఏళ్ళ తర్వాత కోహ్లీ దేశవాళీ క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. జాతీయ జట్టు మ్యాచ్ లు లేనప్పుడు ప్రతీ ప్లేయర్ దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ చెప్పడంతో పలువురు స్టార్ క్రికెటర్లతో పాటు విరాట్ కూడా బరిలోకి దిగాడు. ఢిల్లీ తరపున రంజీ మ్యాచ్ ఆడేందుకు నిర్ణయించుకోవడంతో ఫ్యాన్స్ అతని ఆటను చూసేందుకు స్టేడియానికి పోటెత్తారు. తెల్లవారుఝామున 3 గంటల నుంచే అరుణ్ జైట్లీ స్టేడియం దగ్గర బారులు తీరారు. ఒకదశలో తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. ఫ్యాన్స్ కు ఫ్రీ ఎంట్రీ ఇవ్వడం, కోహ్లీ ఆడుతుండడంతో స్టేడియం హౌస్ ఫుల్ అయిపోయింది. మ్యాచ్ జరుగుతున్నంత సేపూ కోహ్లీ, ఆర్సీబీ అంటూ స్లోగన్స్ వినబడుతూనే ఉన్నాయి. తొలిరోజు రైల్వేస్ బ్యాటింగ్ కావడంతో కోహ్లీ ఫీల్డింగ్ కే పరిమితమయ్యాడు. ఢిల్లీ బౌలర్ల ధాటికి రైల్వేస్ 241 పరుగులకు ఆలౌటవగా.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఢిల్లీ వికెట్ కోల్పోయి 41 పరుగులు చేసింది.

Also Read: Phone Tapping Case : బీఆర్ఎస్ హయాంలో 18 మంది హైకోర్టు జడ్జీలపై నిఘా

కోహ్లీ వన్ డౌన్ వస్తాడని చాలా మంది అనుకున్నారు. కానీ టెస్టుల్లో విరాట్ నాలుగో స్థానంలో ఆడుతుండడంతో మరో వికెట్ పడితే తప్ప అతను బ్యాటింగ్ కు రాలేడు. దీంతో శుక్రవారం కూడా ఫ్యాన్స్ మరింత ఎక్కువ మంది మ్యాచ్ ను చూసేందుకు వచ్చే అవకాాశాలున్నాయి. అటు తొలిరోజు ఆటలో సెక్యూరిటీ ఇవ్వలేక పోలీసులు చేతులెత్తయడంతో పారా మిలిటరీ బలగాలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇక రెండోరోజు మరింత పకడ్బందీగా భద్రత కల్పించాలని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ భావిస్తోంది. కోహ్లీ పుణ్యామాని రంజీ మ్యాచ్ కు భారీ సంఖ్యలో అభిమానులు హాజరవడం అటు రెండు జట్ల క్రికెటర్లలోనూ ఉత్సాహాన్ని నింపింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi
  • Domestic Cricket
  • Khana Nahi Khaya
  • Ranji Trophy
  • sports news
  • Virat Kohli Trolls Delhi Crowd

Related News

T20 World Cup 2026

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ ఎప్పుడంటే?

టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ మార్చి 8న జరగనుంది. అయితే ఫైనల్ వేదిక అనేది పాకిస్తాన్ టైటిల్ పోరుకు చేరుతుందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్‌కు చేరుకోవడంలో విజయం సాధిస్తే టైటిల్ మ్యాచ్ కొలంబోలో జరుగుతుంది.

  • Smriti Mandhana

    Smriti Mandhana: స్మృతి మంధానా పెళ్లి క్యాన్సిల్ అయిందా?!

  • India vs South Africa

    India vs South Africa: రెండో టెస్ట్‌లో భారత్‌కు భారీ లక్ష్యం.. టీమిండియా గెలుపు క‌ష్ట‌మేనా?!

  • Shreyas Iyer

    Shreyas Iyer: జిమ్‌లో సైక్లింగ్ మొదలుపెట్టిన భారత వైస్-కెప్టెన్!

  • Hayli Gubbi Volcano

    Hayli Gubbi Volcano in Ethiopia : 12 వేల ఏళ్ల తర్వాత బద్దలైన అగ్నిపర్వతం.. ఆ దేశాలను కమ్మేసిన బూడిద!

Latest News

  • Black Friday Sale: బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఇక‌పై సులభంగా షాపింగ్‌!

  • Ram Temple: ఇది మీకు తెలుసా? అయోధ్య రామమందిరంలో 45 కిలోల బంగారం వినియోగం!

  • Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. సెన్సార్ టాక్ సూపర్ పాజిటివ్!

  • Baba Vanga: భ‌య‌పెడుతున్న బాబా వంగా భవిష్యవాణి!

  • Sarpanch Election Schedule: పంచాయతీ ఎన్నికల నగారా.. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి!

Trending News

    • Miss Universe-2025 : ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడ్డ మిస్ యూనివర్స్ బ్యూటీ

    • Private Travels Ticket Rates : సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్‌న్యూస్!

    • Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!

    • Bank: రేపు ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయా?

    • Punjabi Cremation: ధర్మేంద్రకు తుది వీడ్కోలు.. సిక్కు సంప్రదాయంలో అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd