IPL2022: దినేష్ కార్తీక్ ధనాధన్…RCB విజయం
- By Naresh Kumar Published Date - 01:53 AM, Wed - 6 April 22
ట్వంటీ ట్వంటీ ఫార్మాట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేము. అప్పటివరకు గెలుస్తుందని అనుకున్న జట్టు ఓడిపోవచ్చు. ఒక్క ఓవర్ మ్యాచ్ ఫలితాన్నే తారు మారు చేయొచ్చు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ మ్యాచ్ లో ఇదే జరిగింది. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం ఖాయమనుకుంటే ఒక్క ఓవర్ లో దినేష్ కార్తీక్ మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. ఫలితంగా బెంగళూర్ అద్బుత విజయం అందుకుంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 169 రన్స్ చేసింది.జోస్ బట్లర్(ఎల్ 47 బంతుల్లో 6 సిక్స్లతో 70 నాటౌట్ మరో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. హెట్మైర్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 42 నాటౌట్ దేవదత్ పడిక్కల్ 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 37 రన్స్ తో రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లే, హసరంగా, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు.
170 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీకీ ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్ 20 బంతుల్లో 5 ఫోర్లతో 29 అనూజ్ రావత్ 25 బంతుల్లో 4 ఫోర్లతో 26 శుభారంభం అందించారు. అయితే పవర్ ప్లే తర్వాత రాజస్థాన్ బౌలర్లు పుంజుకోవడంతో బెంగుళూరు వరుస వికెట్లు కోల్పోయింది. 87/5తో ఓటమి ఖాయమనుకున్న ఆర్సీబీని దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్ సూపర్ బ్యాటింగ్తో గెలిపించారు.దినేశ్ కార్తీక్ తనదైన బ్యాటింగ్తో మ్యాచ్ గమనాన్నే మార్చేసాడు. రవిచంద్రన్ అశ్విన్ చేసిన తప్పిదం అతనికి కలిసొచ్చింది. అశ్విన్ వేసిన 14వ ఓవర్ మూడో బంతిని దినేశ్ కార్తీక్ బౌండరీ తరలించగా.. అది నో బాల్ అయ్యింది. ఆ మరుసటి బంతిని భారీ సిక్సర్ బాదిన దినేశ్ కార్తీక్.. మరో రెండు ఫోర్లతో 21 పరుగులు పిండుకొని ఆర్సీబీని రేసులోకి తెచ్చాడు. చాహల్ వేసిన ఓవర్ లో 4 రన్స్ మాత్రమే చేసినా ..తర్వాత బౌల్ట్ ఓవర్ లో చెలరేగి ఆడారు. చివర్లో శాబాజ్ ఔటయినా చేధించాల్సిన రన్ రేట్ తక్కువగా ఉండటంతో కార్తీక్.. హర్షల్ పటేల్ సాయంతో ఆ పని పూర్తి చేసాడు. ప్రసిధ్ కృష్ణ వేసిన 19వ ఓవర్లో దినేశ్ కార్తీక్ రెండు బౌండరీలు బాదగా.. ఆఖరి ఓవర్లో హర్షల్ పటేల్ భారీ సిక్సర్తో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
Related News
MI vs LSG: నేడు లక్నో వర్సెస్ ముంబై.. విజయంతో ముగించే జట్టు ఏదో..?
IPL 2024 లీగ్ దశ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది.