Virat Kohli: ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ..!
ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 7 వికెట్ల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది.
- By Gopichand Published Date - 12:21 AM, Sun - 23 March 25

Virat Kohli: ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 7 వికెట్ల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) 59 పరుగులతో నాటౌట్గా నిలిచి, ఐపీఎల్లో ఒక పెద్ద రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్లోని తొలి మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), ఆర్సీబీ మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగింది. ఈ టీ20 లీగ్లోని అతిపెద్ద ఆటగాడైన విరాట్ కోహ్లీ తన 59 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్తో అభిమానులను అలరించాడు. ఈ పరుగులతో విరాట్ ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడూ సాధించని ఒక అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీకి 175 పరుగుల లక్ష్యాన్ని జట్టు 16.2 ఓవర్లలోనే సాధించింది.
ఐపీఎల్లో నాలుగు జట్లపై 1000+ పరుగులు చేసిన తొలి ఆటగాడు
విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో నాలుగు వేర్వేరు జట్లపై 1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేకేఆర్పై మ్యాచ్లో 59 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్లో 36 బంతులు ఆడి నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు. కేకేఆర్పై 1000 పరుగులు పూర్తి చేసిన కోహ్లీ, ఇంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ (1057), చెన్నై సూపర్ కింగ్స్ (1053), పంజాబ్ కింగ్స్ (1030) జట్లపై కూడా 1000కి పైగా పరుగులు సాధించాడు.
Also Read: KKR vs RCB: బెంగళూరు అరాచకం.. ఐపీఎల్ను విజయంతో మొదలుపెట్టిన ఆర్సీబీ!
ఆర్సీబీ ఐపీఎల్ చరిత్రలో పవర్ప్లేలో రెండో అత్యధిక స్కోరు
ఐపీఎల్ 18వ సీజన్లో ఆర్సీబీ కొత్త ఓపెనింగ్ జోడీతో బరిలోకి దిగింది. విరాట్ కోహ్లీతో పాటు ఫిల్ సాల్ట్ ఓపెనర్గా బాధ్యతలు స్వీకరించాడు. ఈ ఇద్దరూ కలిసి పవర్ప్లేలో వికెట్ కోల్పోకుండా 80 పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించారు. ఇది ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ పవర్ప్లేలో చేసిన రెండో అత్యధిక స్కోరుగా నిలిచింది.
ఐపీఎల్లో వివిధ టీమ్లపై 1000కిపైగా రన్స్ చేసిన బ్యాటర్లు
- విరాట్ కోహ్లీ (4 జట్లపై)
- డేవిడ్ వార్నర్ (2)
- రోహిత్ శర్మ (2)
- శిఖర్ ధావన్ (1)