IPL 2024 Auction: నేడే ఐపీఎల్ వేలం.. తొలిసారి దుబాయ్లో ఆక్షన్..!
ఐపీఎల్ 2024 వేలం (IPL 2024 Auction) కోసం ప్రతి క్రికెట్ అభిమాని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ క్షణం దగ్గర పడింది. మొదటి బిడ్డింగ్ మంగళవారం మధ్యాహ్నం నుండి ప్రారంభమవుతుంది.
- By Gopichand Published Date - 07:06 AM, Tue - 19 December 23
IPL 2024 Auction: ఐపీఎల్ 2024 వేలం (IPL 2024 Auction) కోసం ప్రతి క్రికెట్ అభిమాని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ క్షణం దగ్గర పడింది. మొదటి బిడ్డింగ్ మంగళవారం మధ్యాహ్నం నుండి ప్రారంభమవుతుంది. దుబాయ్లో ఈ వేలం నిర్వహిస్తున్నారు. వేలం వేదిక దుబాయ్లోని కోకాకోలా అరేనా. తొలిసారిగా భారత్ వెలుపల వేలం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం మొత్తం 333 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు.
256 మంది ఆటగాళ్లకు నో ఛాన్స్
ఈ వేలంలో గరిష్టంగా 77 మంది ఆటగాళ్లు మాత్రమే అదృష్టవంతులు కాబోతున్నారు. 333 మంది ఆటగాళ్లలో కేవలం 77 మంది ఆటగాళ్లు మాత్రమే సెలెక్ట్ అవుతారు. అంటే మిగిలిన 256 మంది ప్లేయర్లు అమ్ముడుపోకుండా ఉంటారు. 77 మందిలో 30 మంది విదేశీ ఆటగాళ్లకు స్లాట్లు ఉన్నాయి. 47 స్లాట్లు భారత ఆటగాళ్లకు చెందినవి. అంటే 160 మందికి పైగా భారతీయ ఆటగాళ్లు కూడా అమ్ముడుపోకుండా ఉండొచ్చు. మొత్తం ఈ వేలంలో 214 మంది భారతీయులు, 119 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు.
ఆటగాళ్ల బేస్ ధర ఎంత?
ఈ వేలంలో అతిపెద్ద బ్రాకెట్ బేస్ ధర రూ. 2 కోట్లు. ఇందులో 23 మంది ఆటగాళ్లను ఉంచారు. ఇది కాకుండా 13 మంది ఆటగాళ్లను రూ.1.50 కోట్ల బేస్ ప్రైస్గా ఉంచారు. రూ. 1 కోటి ప్రాథమిక ధర బ్రాకెట్లో 15 మంది ఆటగాళ్లు ఉన్నారు. రూ.75 లక్షల బేస్ ప్రైస్లో 11 మంది ఆటగాళ్లు, రూ.50 లక్షల బేస్ ప్రైస్లో 56 మంది ఆటగాళ్లు ఉన్నారు.
Also Read: IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభమయ్యేది ఎప్పుడో తెలుసా..?
అందరి చూపు ఈ పెద్ద ఆటగాళ్లపైనే
ఈ వేలంలో అందరి చూపు మిచెల్ స్టార్క్, న్యూజిలాండ్కు చెందిన రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, భారత ఆటగాడు శార్దూల్ ఠాకూర్లపైనే ఉంటుంది. దక్షిణాఫ్రికా యువ ఆటగాడు గెరాల్డ్ కోయెట్జీపైనే కూడా ఉంటుంది. ఆస్ట్రేలియా ప్రపంచ ఛాంపియన్ కెప్టెన్ పాట్ కమిన్స్, ODI ప్రపంచకప్లో శ్రీలంక తరఫున అత్యధిక వికెట్లు తీసిన దిల్షాన్ మధుశంక కోసం ఫ్రాంచైజీల మధ్య పోటీ ఉండవచ్చు.
ఈ ఆటగాడు అత్యుత్తమ ఎంపికగా నిరూపించుకోగలడు.
We’re now on WhatsApp. Click to Join.
కొనుగోలుకు సంబంధించిన విషయాలను పరిశీలిస్తే.. కోల్కతా నైట్ రైడర్స్లో మొత్తం 12 ఖాళీ స్లాట్లు ఉన్నాయి. పర్స్ గురించి చెప్పాలంటే.. గుజరాత్ టైటాన్స్ అత్యధిక పర్స్ రూ.38.15 కోట్లు. గుజరాత్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను విడుదల చేసింది. కాగా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమించింది.
Related News
CSK vs PBKS: చెన్నై చెపాక్ లో కీలక పోరు.. చెన్నై vs పంజాబ్
చెన్నై చెపాక్ లో మరో కీలక పోరుకు రంగం సిద్దమైండ్. ఈ పిచ్ పై చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న పంజాబ్పై చెన్నై జాగ్రత్తగా ఆడాల్సి ఉందంటున్నారు క్రికెట్ అనలిస్టులు. ఎందుకంటే ఈ మ్యాచ్ లో గెలిస్తే ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోగలుగుతుంది.