India vs England: అభిషేక్ ఊచకోత.. 150 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం
టీం ఇండియా ఇంగ్లండ్కు 248 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. దీనిని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది.
- Author : Gopichand
Date : 02-02-2025 - 11:01 IST
Published By : Hashtagu Telugu Desk
India vs England: భారత్, ఇంగ్లండ్ (India vs England) మధ్య ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ జరిగింది. ఈ సిరీస్లో ఐదవ అంటే చివరి మ్యాచ్ ఫిబ్రవరి 2 ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 247 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఇంగ్లండ్ జట్టు కేవలం 97 పరుగులకే కుప్పకూలింది. 150 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన టీమిండియా 4-1తో సిరీస్ని కైవసం చేసుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకున్నాడు. ఎందుకంటే కెప్టెన్గా ఇప్పటి వరకు ఏ టీ20 సిరీస్ను సూర్య కోల్పోలేదు.
ఇంగ్లండ్కు 248 పరుగుల లక్ష్యం
టీం ఇండియా ఇంగ్లండ్కు 248 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. దీనిని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. జట్టు తరఫున ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 3 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. ఇది కాకుండా జాకబ్ బెతెల్ 10 పరుగులు చేశారు. మరే ఇంగ్లాండ్ ఇతర బ్యాట్స్మెన్ కూడా 10 పరుగుల స్కోరును దాటలేకపోయారు.
జట్టు తరఫున బెన్ డకెట్ 0, జోస్ బట్లర్ 7, హ్యారీ బ్రూక్ 2, లియామ్ లివింగ్స్టోన్ 9, జాకబ్ బెతెల్ 10, బ్రైడన్ కార్సే 3, జేమీ ఓవర్టన్ 1, జోఫ్రా ఆర్చర్ నాటౌట్ 1, ఆదిల్ రషీద్ 6, మార్క్ వుడ్ 0 పరుగులు చేయగలిగారు.
Also Read: Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊచకోత.. 37 బంతుల్లో సెంచరీ, రికార్డుల మోత కూడా!
ఈ బౌలర్లు అత్యధిక వికెట్లు తీశారు
టీమిండియా బౌలింగ్లో మహ్మద్ షమీ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో పాటు వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే, అభిషేక్ శర్మ రెండేసి వికెట్లు తీశారు. రవి బిష్ణోయ్ 1 వికెట్ తీశాడు. ఇంగ్లండ్ తరఫున బ్రైడెన్ కార్సే 3 వికెట్లు తీయగా, మార్క్ వుడ్ 2, జోఫ్రా ఆర్చర్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.
తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. జట్టు తరఫున అభిషేక్ శర్మ 135 పరుగులు, శివమ్ దూబే 30, అక్షర్ పటేల్ 15, సంజు శాంసన్ 16, తిలక్ వర్మ 24, సూర్యకుమార్ యాదవ్ 2, హార్దిక్ పాండ్యా 9, రింకు సింగ్ 9, రవి బిష్ణోయ్ 0, మహ్మద్ షమీ అజేయంగా 0 పరుగులు చేశారు.