IND vs AFG 3rd T20I: టై…మళ్లీ టై…ఇండియా విన్ పోరాడి ఓడిన ఆఫ్గనిస్తాన్…
కొత్త ఏడాదిలో టీమిండియా తొలి సీరీస్ ను ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన చివరి టీ ట్వంటీలో ఆఫ్గనిస్తాన్ పై రెండో సూపర్ ఓవర్ లో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్ ల సీరీస్ ను స్వీప్ చేసింది.
- By Praveen Aluthuru Published Date - 11:31 PM, Wed - 17 January 24
IND vs AFG 3rd T20I: కొత్త ఏడాదిలో టీమిండియా తొలి సీరీస్ ను ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన చివరి టీ ట్వంటీలో ఆఫ్గనిస్తాన్ పై రెండో సూపర్ ఓవర్ లో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్ ల సీరీస్ ను స్వీప్ చేసింది. బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పరుగుల వరద పారింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జైస్వాల్ , కోహ్లీ , సంజూ, దూబే నిరాశ పరిచారు. ఈ దశలో రోహిత్-రింకూ విధ్వంసకర బ్యాటింగ్తో ఆదుకున్నారు. ఐదో వికెట్కు అజేయంగా 190 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించారు.
41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుస బౌండరీలతో అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అజ్మతుల్లా వేసిన 19వ ఓవర్లో 6, 4, 4 బాది 64 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ ట్వంటీల్లో రోహిత్ శర్మకు ఇది ఐదో సెంచరీ. దీంతో భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగులు చేసింది. 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 121 చేయగా..రింకూ సింగ్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. 39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లతో 69 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఛేజింగ్ కు అనుకూలించే బెంగుళూరు పిచ్ పై ఆఫ్గనిస్తాన్ కూడా ధాటిగా ఆడింది. వికెట్లు పడుతున్నా ఆ జట్టు బ్యాటర్లు భారీ షాట్లతో దుమ్మురేపారు. టాపార్డర్ లో ముగ్గురు హాఫ్ సెంచరీలు చేయగా…మధ్యలో పుంజుకున్న భారత్ బౌలర్లు వరుస వికెట్లు తీసి కట్టడి చేశారు. అయితే గుల్బాడిన్ మెరుపు హాఫ్ సెంచరీ భారత్ విజయాన్ని అడ్డుకుంది. చివరి ఓవర్ లో విజయం కోసం 19 రన్స్ చేయాల్సి ఉండగా…ముకేష్ కుమార్ ఒత్తిడి లోనయ్యాడు. ఫలితంగా ఆఫ్గనిస్తాన్ 18 రన్స్ తో మ్యాచ్ ని టై చేసింది.
ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించగా…మొదట బ్యాటింగ్ కు దిగిన ఆఫ్గనిస్తాన్ 16 పరుగులు చేసింది. తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సర్లతో విరుచుకుపడినా చివరి బంతికి ఒక పరుగే రావడంతో సూపర్ ఓవర్ కూడా టైగా ముగిసింది. రెండో సూపర్ ఓవర్ లో భారత్ గెలిచింది. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల సీరీస్ ను 3-0 తో స్వీప్ చేసింది.
Also Read: Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. నెలాఖరులోగా రైతు బంధు
Related News
Maldives : దౌత్య పరమైన విభేదాలు..భారత పర్యటనకు రానున్న మాల్దీవుల విదేశాంగ మంత్రి
India and Maldives: భారత్ , మాల్దీవుల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే “మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ మే 9న అధికారిక పర్యటన నిమిత్తం భారత్కు రానున్నారు” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం తెలిపింది. మాల్దీవుల చైనా అనుకూల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ఆరు నెలల క్రితం పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాల్దీవుల విదేశాంగ మంత్రి మూస�