Suryakumar Yadav: రికార్డు సృష్టించిన సూర్యకుమార్.. ఏకంగా కోహ్లీ రికార్డుకే చెక్..!
శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ బ్యాట్స్మెన్గానే కాకుండా కెప్టెన్గా కూడా నిరూపించుకున్నాడు.
- By Gopichand Published Date - 12:17 AM, Sun - 28 July 24

Suryakumar Yadav: శ్రీలంక టూర్లో టీమిండియా శుభారంభం చేసింది. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్గా.. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) టీ20 కెప్టెన్గా భారత క్రికెట్కు కొత్త శకం ప్రారంభమైంది. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ బ్యాట్స్మెన్గానే కాకుండా కెప్టెన్గా కూడా నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 43 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. సూర్యకుమార్ దూకుడుగా బ్యాటింగ్ చేసి 33 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 233.08 స్ట్రైక్ రేట్తో 58 పరుగులు చేశాడు. అతని అద్భుతమైన బ్యాటింగ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది.
సూర్యకుమార్ యాదవ్ ఈ రికార్డు సృష్టించాడు
POTM టైటిల్తో చరిత్ర సృష్టించాడు. సూర్యకుమార్ యాదవ్ అతి తక్కువ మ్యాచ్ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (POTM) టైటిల్స్ గెలుచుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. సూర్య 69 మ్యాచ్ల్లో 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఈ విషయంలో సూర్యకుమార్ ప్రపంచ నంబర్-1 ఆటగాడిగా నిలిచాడు. సూర్య కంటే ముందు స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ 16 POTM అవార్డులను కూడా గెలుచుకున్నాడు. ఇప్పుడు సూర్య కూడా కోహ్లీతో సమానంగా నిలిచాడు. కానీ విరాట్ 125 మ్యాచ్ల్లో 16సార్లు గెలిచాడు. ఇప్పుడు టీ-20 నుంచి కూడా రిటైరయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక మ్యాచ్లో సూర్య అతడ్ని అధిగమిస్తాడని క్రీడా పండితులు భావిస్తున్నారు.
Also Read: IND vs SL 1st T20I: బోణీ అదిరింది లంకపై తొలి టీ ట్వంటీ మనదే
Joint most POTM 🔥 pic.twitter.com/p3pL71TdtJ
— Cricket Craze (@cricupdates___) July 27, 2024
సికందర్ రజా, మహమ్మద్ నబీ, రోహిత్ శర్మ కూడా ఉన్నారు
విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ తర్వాత అత్యధిక POTM అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో జింబాబ్వే స్టార్ సికందర్ రజా పేరు కూడా ఉంది. సికిందర్ 91 మ్యాచ్ల్లో 15 సార్లు ఈ టైటిల్ను గెలుచుకున్నాడు. ఆ తర్వాత మలేషియా ఆటగాడు విరందీప్ సింగ్ 78 మ్యాచ్ల్లో 14 అవార్డులు గెలుచుకుని ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్థాన్ స్టార్ ప్లేయర్ మహ్మద్ నబీ ఐదో స్థానంలో ఉన్నాడు. నబీ 129 మ్యాచ్లలో 14 POTM అవార్డులను గెలుచుకున్నాడు. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 159 మ్యాచ్ల్లో 14 అవార్డులు గెలుచుకుని ఈ జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.
We’re now on WhatsApp. Click to Join.