రేపు భారత్- పాక్ మధ్య మ్యాచ్.. పిచ్ రిపోర్ట్ ఇదే!!
ఆర్. ప్రేమదాస స్టేడియం పిచ్ ఎప్పుడూ స్పిన్నర్లకు స్వర్గధామంలా ఉంటుంది. ఈ టీ20 ప్రపంచకప్లో ఇక్కడ జరిగిన మూడు మ్యాచ్ల్లోనూ స్పిన్నర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది.
- Author : Gopichand
Date : 14-02-2026 - 7:30 IST
Published By : Hashtagu Telugu Desk
IND vs PAK: టీ20 వరల్డ్ కప్లో రేపు భారత్- పాకిస్తాన్ మధ్య మహా సమరం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. ప్రతిసారీ లాగే ఈసారి కూడా భారత్-పాక్ మ్యాచ్ కోసం అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం కనిపిస్తోంది. ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ ఆర్. ప్రేమదాస స్టేడియం పిచ్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత వరల్డ్ కప్లో ఈ స్టేడియంలో ఇప్పటివరకు శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్, ఆస్ట్రేలియా వర్సెస్ ఐర్లాండ్, జింబాబ్వే వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్లు జరిగాయి. ఈ మూడు మ్యాచ్ల్లోనూ భారీ స్కోర్లు నమోదు కాలేదు. సూటిగా చెప్పాలంటే ఏ జట్టు కూడా 200 పరుగుల మార్కును అందుకోలేదు. ఐర్లాండ్పై ఆస్ట్రేలియా చేసిన 182/6 పరుగులే ఇక్కడ నమోదైన అత్యధిక స్కోరు.
Also Read: ఐ-పిల్ వాడుతున్నారా? అయితే దుష్ప్రభావాలివే!!
ఈ మైదానంలో భారత్-పాకిస్తాన్ మధ్య నాలుగో మ్యాచ్
ప్రస్తుత వరల్డ్ కప్లో భారత్- పాకిస్తాన్ మధ్య జరగబోయే పోరు ఈ స్టేడియంలో నాలుగో మ్యాచ్ కానుంది. భారత్-పాక్ మ్యాచ్లో ఒత్తిడి సహజంగానే ఎక్కువగా ఉంటుంది. దీనిని బట్టి చూస్తే ఈ మ్యాచ్లో కూడా 200 పరుగుల టోటల్ రావడం కష్టమేనని అంచనా వేస్తున్నారు. అయితే ఒకవేళ టీమ్ ఇండియా ముందుగా బ్యాటింగ్ చేస్తే స్కోరు 200 పరుగుల వరకు వెళ్లే అవకాశం ఉంది.
పిచ్ ఎవరికి సహకరిస్తుంది: బ్యాటర్లకా లేక బౌలర్లకా?
ఆర్. ప్రేమదాస స్టేడియం పిచ్ ఎప్పుడూ స్పిన్నర్లకు స్వర్గధామంలా ఉంటుంది. ఈ టీ20 ప్రపంచకప్లో ఇక్కడ జరిగిన మూడు మ్యాచ్ల్లోనూ స్పిన్నర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. అంతేకాకుండా ఈ పిచ్పై బంతి ‘డబుల్ పేస్’ (రెండు రకాల వేగంతో) రావడాన్ని గమనించవచ్చు. దీనివల్ల బ్యాటర్లు పరుగులు చేయడం అంత సులభం కాదు. మొత్తానికి ఈ పిచ్పై స్పిన్నర్ల రాజ్యమే నడిచే అవకాశం ఉంది.
ఈ స్టేడియంలో భారత్ టీ20 రికార్డు
ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్ ఇప్పటివరకు 15 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడింది. ఇందులో టీమ్ ఇండియా 11 మ్యాచ్ల్లో విజయం సాధించగా, కేవలం 4 మ్యాచ్ల్లో మాత్రమే ఓడిపోయింది.