IND vs BAN: వన్డే సిరీస్ను టీమిండియా సమం చేస్తుందా..? బంగ్లాతో నేడు రెండో వన్డే..!
- By Gopichand Published Date - 06:40 AM, Wed - 7 December 22
బంగ్లాదేశ్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా (TEAM INDIA) ఒక్క వికెట్ తేడాతో ఓడిపోయింది. దీని తర్వాత భారత బ్యాట్స్మెన్, కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిరీస్లోని మొదటి మ్యాచ్లో భారత జట్టు 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేఎల్ రాహుల్ తప్ప మరే భారత బ్యాట్స్మెన్ కూడా 30 పరుగుల స్కోరును అందుకోలేకపోయారు. మొదటి వన్డేలో బౌలర్లు పునరాగమనం చేసినప్పటికీ చివరి వికెట్కు మెహదీ హసన్, ముస్తాఫిజుర్ రెహమాన్ అజేయ అర్ధ సెంచరీతో రాణించి బంగ్లాదేశ్కు మొదటి వన్డేలో ఉత్కంఠ విజయాన్ని అందించారు. 2015లో బంగ్లాదేశ్తో జరిగిన చివరి వన్డే సిరీస్లో టీమిండియా (TEAM INDIA) 1-2తో ఓడిన సంగతి తెలిసిందే.
వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ వన్డే సిరీస్కు దూరమయ్యాడు. ఇషాన్ కిషన్ జట్టులో ఉన్నప్పటికీ తొలి వన్డేలో రెగ్యులర్ వికెట్ కీపర్ కు జట్టులో చోటు దక్కలేదు. కేఎల్ రాహుల్ కీపింగ్ బాధ్యత వహించాడు. చివరి క్షణంలో మెహదీ హసన్ క్యాచ్ను రాహుల్ జారవిడుచుకోవడంతో మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా భావించారు. అటువంటి పరిస్థితిలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ రెండో వన్డేలో ప్లే-11లో అవకాశం పొందవచ్చు. ఎడమచేతి వాటం స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ స్థానంలో అతడికి అవకాశం కల్పించవచ్చు. తొలి మ్యాచ్లో షాబాజ్ 9 ఓవర్లలో 39 పరుగులిచ్చి ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు.
Also Read: Car Racing:కార్ రేసింగ్ వల్ల తప్పని ట్రాఫిక్ ఆంక్షలు!
లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ కూడా తొలి వన్డేలో ఆడలేదు. మిర్పూర్ స్పిన్ ట్రాక్లో పటేల్ జట్టుకు ముఖ్యమైనవాడని నిరూపించగలడు. అతను లోయర్ ఆర్డర్లో కూడా బాగా బ్యాటింగ్ చేస్తాడు. కుల్దీప్ సేన్ స్థానంలో అతనికి చోటు కల్పించవచ్చు. ఫాస్ట్ బౌలర్ సేన్ తొలి వన్డే నుంచి అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 5 ఓవర్లలో 37 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. తొలి మ్యాచ్లో ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 5 ఓవర్లలో 17 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.
బంగ్లాదేశ్ తొలి మ్యాచ్లో విజయం సాధించి టీమిండియాపై ఒత్తిడి పెంచింది. ఇక సిరీస్ను కైవసం చేసుకోవాలంటే భారత్ మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ గెలవాలి. అంతకుముందు టీ20 ప్రపంచకప్లోనూ బంగ్లాదేశ్ భారత జట్టుకు గట్టిపోటీనిచ్చింది. ఇరు జట్ల మధ్య ఇది 5వ ద్వైపాక్షిక వన్డే సిరీస్. భారత్ 3 గెలుపొందగా, బంగ్లాదేశ్ ఒక సిరీస్ గెలిచింది. భారత్ సిరీస్ గెలవాలంటే రోహిత్, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ బ్యాటింగ్లో రాణించాల్సి ఉంటుంది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే ఈరోజు జరగనుంది.
TOYAM Sports Limited ODI Series: Bangladesh vs India
2nd ODI, 7th December, 2022 | 12:00 PM at SBNCS#BCB | #Cricket | #BANvIND pic.twitter.com/fG0gIjlAeN
— Bangladesh Cricket (@BCBtigers) December 6, 2022
Related News
RCB vs SRH: ఆర్సీబీ బౌలర్లకు మళ్లీ దబిడిదిబిడే బెంగళూరుతో మ్యాచ్కు సన్రైజర్స్ రెడీ
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థి బౌలర్లు వణికిపోతున్నారు...ఒకటా రెండా.. ఏకంగా మూడు మ్యాచ్లలో ఆ జట్టు రికార్డు స్కోర్లు నమోదు చేసింది...అసలు సన్రైజర్స్ బ్యాటర్లు క్రీజులోకి వస్తున్నారంటే చాలు ప్రత్యర్థి బౌలర్లకు ఫీజులు ఎగిరిపోతున్నాయి.