World Cup 2023: అంతరిక్షంలో వన్డే ప్రపంచకప్ ట్రోఫీ ఆవిష్కరణ.. వైరల్ అవుతున్న వీడియో..!
ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ (World Cup 2023) ట్రోఫీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అత్యంత విశిష్టంగా ఆవిష్కరించింది.
- By Gopichand Published Date - 06:30 AM, Tue - 27 June 23
World Cup 2023: ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ (World Cup 2023) ట్రోఫీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అత్యంత విశిష్టంగా ఆవిష్కరించింది. ఇది భూమికి 1,20,000 అడుగుల ఎత్తులో ఉన్న అంతరిక్ష స్ట్రాటో ఆవరణలో ఆవిష్కరించబడింది. ఆ ఎత్తులో ఉష్ణోగ్రత మైనస్ 65 డిగ్రీలు. ఆ తర్వాత అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ట్రోఫీ ల్యాండింగ్ జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సెక్రటరీ జై షా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అక్టోబర్-నవంబర్లో భారత్లో ప్రపంచకప్ జరగనుంది. భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) మంగళవారం టోర్నీ షెడ్యూల్ను ప్రకటించనుంది.
క్రికెట్ వరల్డ్ కప్ 2023 ట్రోఫీని అంతరిక్షంలో ఆవిష్కరించడం క్రికెట్ ప్రపంచానికి అపూర్వ క్షణమని బీసీసీఐ సెక్రటరీ జే షా ట్వీట్ చేశారు. ఇది అంతరిక్షంలోకి పంపబడిన క్రీడా ట్రోఫీలలో ఒకటి. నిజానికి భారత్లో ఐసిసి పురుషుల ప్రపంచకప్ ట్రోఫీ పర్యటన ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచ కప్ టూర్ జూన్ 27 న ప్రారంభమవుతుంది. ట్రోఫీ కువైట్, బహ్రెయిన్, మలేషియా, USA, నైజీరియా, ఉగాండా, ఫ్రాన్స్, ఇటలీ, ఆతిథ్య భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా 18 దేశాలకు వెళ్తుంది. ఈ పర్యటన ద్వారా లక్షలాది మంది క్రికెట్ అభిమానులు వివిధ కార్యక్రమాల ద్వారా మెరుస్తున్న ట్రోఫీని వీక్షించగలరు.
Also Read: IND vs PAK : అహ్మదాబాద్ లోనే భారత్ , పాక్ మ్యాచ్.. రేపే వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకటన
An out-of-this-world moment for the cricketing world as the #CWC23 trophy unveiled in space. Marks a milestone of being one of the first official sporting trophies to be sent to space. Indeed a galactic start for the ICC Men's Cricket World Cup Trophy Tour in India. @BCCI @ICC… pic.twitter.com/wNZU6ByRI5
— Jay Shah (@JayShah) June 26, 2023
ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ట్రోఫీ టూర్ ఒక ముఖ్యమైన మైలురాయి అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డిస్ అన్నారు. ఇప్పుడు అతిపెద్ద ICC ప్రపంచ కప్ కోసం వేచి ఉండండి. క్రికెట్కు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. వీలైనంత ఎక్కువ మంది ఈ ట్రోఫీని దగ్గరగా చూడాలని మేము కోరుకుంటున్నామని ఆయన తెలిపారు.
బీసీసీఐ సెక్రటరీ జై షా మాట్లాడుతూ.. ఇతర క్రీడల కంటే క్రికెట్ దేశాన్ని కలుపుతుంది. దేశంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ప్రపంచంలోని పది అత్యుత్తమ జట్లలో ఆరు వారాల క్రికెట్ ప్రపంచ కప్ను నిర్వహించేందుకు మేము ఎదురుచూస్తున్నాం. ప్రపంచ కప్కు కౌంట్డౌన్ ప్రారంభమైంది.ట్రోఫీ టూర్ అభిమానులకు మెగా ఈవెంట్లో భాగం కావడానికి ఇదే ఉత్తమ అవకాశం అని ఆయన పేర్కొన్నారు.
Related News
Gautam Gambhir: భారత్ జట్టు కోచ్గా టీమిండియా మాజీ క్రికెటర్..?
భారత జట్టుకు కొత్త కోచ్ని తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది బీసీసీఐ. తాజాగా న్యూజిలాండ్ దిగ్గజం స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచ్ పదవికి పోటీ పడుతున్నట్లు సమాచారం వచ్చింది.