Heath Streak: క్యాన్సర్ తో లెజెండరీ క్రికెటర్ కన్నుమూత
జింబాబ్వే లెజెండరీ క్రికెటర్, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్(49) (Heath Streak) క్యాన్సర్ తో కన్నుమూశారు. గతంలో జింబాబ్వే టీం కెప్టెన్ గా, బెస్ట్ బౌలర్ గా ఉన్న ఆయన టెస్టుల్లో 216 వికెట్లు, వన్డేల్లో 239 వికెట్లు తీశారు.
- By Gopichand Published Date - 09:29 AM, Wed - 23 August 23
Heath Streak: జింబాబ్వే లెజెండరీ క్రికెటర్, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్(49) (Heath Streak) క్యాన్సర్ తో కన్నుమూశారు. గతంలో జింబాబ్వే టీం కెప్టెన్ గా, బెస్ట్ బౌలర్ గా ఉన్న ఆయన టెస్టుల్లో 216 వికెట్లు, వన్డేల్లో 239 వికెట్లు తీశారు. జింబాబ్వే తరుపున 100 టెస్ట్ వికెట్లు తీసిన తొలి బౌలర్ గా నిలిచిన స్ట్రీక్ 2005లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. బంగ్లాదేశ్, జింబాబ్వే, ఐపీఎల్ లో కేకేఆర్ టీంకు కోచ్ గా వ్యవహరించారు.
అంతర్జాతీయ క్రికెట్లో బౌలర్ ఆల్ రౌండర్గా ఆడుతున్న హీత్ స్ట్రీక్ టెస్టు క్రికెట్లో మొత్తం 216 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో అతను ఒక ఇన్నింగ్స్లో 16 సార్లు 4 వికెట్లు, 7 సార్లు ఒక ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. అదే సమయంలో హీత్ స్ట్రీక్ బంతితో అద్భుత ప్రదర్శన వన్డే క్రికెట్లో కూడా కనిపించింది.
హీత్ స్ట్రీక్ 50 ఓవర్ల ఫార్మాట్లో 29.82 సగటుతో 239 వికెట్లు తీశాడు. ఈ సమయంలో అతను తన వన్డే కెరీర్లో ఒక ఇన్నింగ్స్లో 4 వికెట్లు, ఒకసారి 5 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. బ్యాట్తో హీత్ స్ట్రీక్ ప్రదర్శన చూస్తే అతను టెస్టుల్లో 1990 పరుగులు, వన్డేల్లో 2943 పరుగులు చేశాడు. స్ట్రీక్ టెస్టుల్లో 1 సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో 13 అర్ధ సెంచరీ ఇన్నింగ్స్లను కలిగి ఉన్నాడు.
Also Read: Najam Sethi: పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో భారీ మార్పులు.. మరోసారి ఛైర్మన్ గా నజామ్ సేథీ..?
Heath Streak is no more. Sad!! Really sad. #RIP
— Ashwin 🇮🇳 (@ashwinravi99) August 23, 2023
కెప్టెన్సీ రికార్డు
2000 సంవత్సరంలో జింబాబ్వే క్రికెట్ బోర్డు హీత్ స్ట్రీక్ను టెస్ట్, ODI జట్లకు కెప్టెన్గా నియమించింది. స్ట్రీక్ కెప్టెన్సీలో జింబాబ్వే 21 టెస్టు మ్యాచ్ల్లో 4 గెలిచి, 11 ఓడిపోయింది. 6 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ODIలలో స్ట్రీక్ 68 మ్యాచ్లలో జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఇందులో 47 మ్యాచ్లలో ఓటమి పాలైంది. 18 మ్యాచ్లలో విజయం సాధించింది. స్ట్రీక్ మరణం తరువాత భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్తో సహా చాలా మంది మాజీ, ప్రస్తుత ఆటగాళ్ళు ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు.
Related News
ZIM vs IND T20: జింబాబ్వే టూర్కు కెప్టెన్గా రహానే
ఈ ఏడాది జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత టీమిండియా టి20 వరల్డ్ కప్ ఆడాల్సి ఉంది. ఈ టోర్నీకి సీనియర్ ఆటగాడు అజింక్యా రహానేకి చోటు దక్కలేదు. అయితే ఐపీఎల్లో రహానే ప్రదర్శన బాగుంటే జింబాబ్వే టూర్కు కెప్టెన్గా ఎంపికయ్యే అవకాశముంది.