Nitish Kumar Reddy: ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో జట్టులోకి వచ్చేది ఎవరు?
శార్దూల్ ఠాకూర్ అనుభవజ్ఞుడైన ఆల్రౌండర్ కావడంతో నీతీష్ రెడ్డి స్థానంలో అతను అత్యంత అనుకూలమైనవాడిగా పరిగణించబడుతున్నాడు.
- Author : Gopichand
Date : 21-07-2025 - 2:40 IST
Published By : Hashtagu Telugu Desk
Nitish Kumar Reddy: ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-2తో వెనుకబడి ఉంది. సిరీస్ సమం చేయాలంటే నాల్గవ టెస్ట్ కీలకం. బుధవారం మాంచెస్టర్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్లో గెలిచేందుకు భారత జట్టు కీలక మార్పులు చేయాల్సి ఉంది. గాయపడిన ఆల్రౌండర్ నీతీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) స్థానంలో ప్లేయింగ్ ఎలెవన్లో ఎవరికి అవకాశం లభిస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
నీతీష్ రెడ్డి స్థానంలో రేసులో ఉన్న ఆటగాళ్లు
నీతీష్ రెడ్డి ఇప్పటివరకు ఆడిన రెండు టెస్టుల్లో 45 పరుగులు చేసి, మూడు వికెట్లు తీశాడు. లార్డ్స్ టెస్ట్లో ఆకట్టుకున్నా, స్థిరమైన ప్రదర్శన లేకపోవడం, తాజాగా మోకాలి గాయం కారణంగా అతను ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. అతని స్థానంలో ముగ్గురు ఆటగాళ్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
శార్దూల్ ఠాకూర్
శార్దూల్ ఠాకూర్ అనుభవజ్ఞుడైన ఆల్రౌండర్ కావడంతో నీతీష్ రెడ్డి స్థానంలో అతను అత్యంత అనుకూలమైనవాడిగా పరిగణించబడుతున్నాడు. హెడింగ్లే టెస్ట్లో అతను బ్యాట్తో పెద్దగా రాణించకపోయినా, బౌలింగ్లో ఎక్కువ ఓవర్లు వేయించకపోయినా, అతని అనుభవం, ఒత్తిడిలో రాణించే సామర్థ్యం జట్టుకు ఉపయోగపడతాయి.
Also Read: Pakistan Hockey Team: భారత్కు మా జట్టును పంపేది లేదు.. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్కు పాక్ లేఖ!
అంశుల్ కంబోజ్
హర్యానాకు చెందిన యువ పేస్ బౌలర్ అంశుల్ కంబోజ్ను ఇటీవలే జట్టు కవర్గా పిలిచారు. దేశీయ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన కంబోజ్.. ఇంగ్లండ్ లయన్స్పై ఇండియా ‘ఎ’ తరపున ఆడుతూ ఒక అర్ధశతకం కూడా సాధించాడు. భారత్ యువ ఆటగాడికి అవకాశం ఇవ్వాలనుకుంటే కంబోజ్కు టెస్ట్ అరంగేట్రం చేయించవచ్చు.
ధ్రువ్ జురెల్, అంశుల్ కంబోజ్
మరొక వ్యూహాత్మక ఎంపిక ఏమిటంటే.. బ్యాటింగ్ను బలోపేతం చేయడానికి వికెట్ కీపర్-బ్యాట్స్మన్ ధ్రువ్ జురెల్ను ప్లేయింగ్ ఎలెవన్లో చేర్చడం. బౌలింగ్ విభాగంలో గాయపడిన ఆకాశ్ దీప్ స్థానంలో అంశుల్ కంబోజ్కు అవకాశం ఇవ్వవచ్చు. ఈ కాంబినేషన్తో భారత బౌలింగ్ యూనిట్లో జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, అంశుల్ కంబోజ్ (డెబ్యూ), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఉంటారు. ఇది జట్టుకు మరింత సమతుల్యాన్ని ఇస్తుంది.
గాయాల ఆందోళనలు
టీమ్ ఇండియా ఇప్పటికే అనేక ఆటగాళ్ల గాయాలతో సతమతమవుతోంది. రిషభ్ పంత్, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్ వంటి కీలక ఆటగాళ్లు ఫిట్నెస్ సమస్యల కారణంగా అందుబాటులో లేరు. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ గిల్, జట్టు మేనేజ్మెంట్, కోచ్ గౌతమ్ గంభీర్తో కలిసి ప్లేయింగ్ ఎలెవన్ను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.