England vs Afghanistan: టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ శుభారంభం.. పలు రికార్డులు కూడా నమోదు..!
T20 ప్రపంచకప్-2022లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది.
- By Gopichand Published Date - 08:19 PM, Sat - 22 October 22
T20 ప్రపంచకప్-2022లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. సూపర్-12లో భాగంగా అప్ఘానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. 113 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 18.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో లివింగ్ స్టోన్(29 నాటౌట్), హేల్స్(19) పరుగులతో రాణించారు.
సూపర్-12లో భాగంగా అఫ్ఘానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ పేసర్ సామ్ కర్రాన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో 3.4 ఓవర్లు బౌలింగ్ చేసిన కర్రాన్ 10 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన తొలి ఇంగ్లండ్ బౌలర్గా రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ పేరిట ఉండేది.
అంతేకాకుండా ఈ మ్యాచ్ లో మరో ప్రపంచ రికార్డు నమోదైంది. ఇంగ్లండ్-అఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఈరోజు జరిగిన మ్యాచ్ ప్రపంచ రికార్డుకు వేదికైంది. అఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో 10మంది ప్లేయర్లు క్యాచ్ ఔట్ల రూపంలో పెవిలియన్ చేరారు. T20 క్రికెట్ చరిత్రలో ఇలా 10మంది ప్లేయర్లు క్యాచ్ ఔట్ కావడం ఇది రెండోసారి. గతంలో ఆస్ట్రియా-జర్మనీ జట్లమధ్య జరిగిన మ్యాచ్లో ఇలా జరిగింది.
Related News
Hybrid Pitch: భారతదేశపు మొదటి హైబ్రిడ్ పిచ్ సిద్ధం
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ధర్మశాలలో భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ పిచ్ను ఏర్పాటు చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్, మాజీ ఇంగ్లండ్ అంతర్జాతీయ క్రికెటర్ మరియు ఎస్ఐఎస్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ పాల్ టేలర్ మరియు హెచ్పిసిఎ అధికారుల సమక్షంలో ఎస్ఐఎస్ గ్రాస్ హైబ్రిడ్ పిచ్ను ఆవిష్కరించారు.