HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Chepauk Will Play Host To The 2nd T20i Between India And England

Chepauk: చెపాక్ లోనూ మనదే పైచేయి, ఇంగ్లాండ్ బలహీనత అదే!

ఇంగ్లాండ్ విషయానికి వస్తే తొలి మ్యాచ్‌లో ఆ జట్టులో ఒకే ఒక్క స్పిన్నర్ ని ఆడించారు. ఆదిల్ రషీద్ ఒక్కడికే తుది జట్టులో చోటు కల్పించారు. లియామ్ లివింగ్‌స్టోన్ ఒక పార్ట్-టైమ్ స్పిన్నర్.

  • Author : Naresh Kumar Date : 24-01-2025 - 5:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chepauk
Chepauk

Chepauk: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. కోల్‌కతాలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ గెలిచి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు రెండవ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ (Chepauk) స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను సమం చేయాలని ఇంగ్లాండ్‌ భావిస్తుండగా, టీమిండియా అదే జోరును కొనసాగించాలి అనుకుంటుంది. ఆరంభం మ్యాచ్ లో జోస్ బట్లర్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. మిగతా బ్యాటర్లు రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. ఇక టీమిండియా తరుపున అభిషేక్ శర్మ ఊచకోత కోశాడు. 133 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అభిషేక్ శర్మ 34 బంతుల్లో 79 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. ఇన్నింగ్స్ లో అభిషేక్ 5 ఫోర్లు, 8 సిక్సర్లతో విలయతాండవం చేశాడు. తద్వారా అభిషేక్ శర్మ తన టీ20 కెరీర్‌లో రెండో అర్ధ సెంచరీని కేవలం 20 బంతుల్లోనే పూర్తి చేసుకున్నాడు. కానీ చెన్నై పిచ్ పై ఆ దూకుడు కొనసాగించడం కష్టమే అంటున్నారు పిచ్ విశ్లేషకులు.

రెండో టి20లో చెపాక్ పిచ్ కీలక పాత్ర పోషించనుంది. గెలుపు ఓటములు పిచ్ పరిస్థితిపై ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్లు పిచ్ ని పరిశీలించిన తరువాతే తుది జట్టును నిర్ణయించే అవకాశం ఉంది. దీంతో మ్యాచ్ కి ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ చెన్నై పిచ్ ని పరిశీలించనున్నారు. చెన్నై పిచ్ నెమ్మదిగా ఉంటుంది. స్పిన్నర్లకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పిచ్‌పై స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లను దింపింది. రవి బిష్ణోయ్ తో పాటు వరుణ్ చక్రవర్తి మరియు అక్షర్ పటేల్ తుది జట్టులో ఉన్నారు. అయితే చిదంబరం పిచ్‌ని చూస్తే ఈ ముగ్గురు ఆడటం ఖాయంగా కనిపిస్తుంది.

Also Read: ICC Mens ODI Team: ఐసీసీ పురుషుల వ‌న్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 ఇదే.. టీమిండియాకు షాక్‌!

ఇంగ్లాండ్ విషయానికి వస్తే తొలి మ్యాచ్‌లో ఆ జట్టులో ఒకే ఒక్క స్పిన్నర్ ని ఆడించారు. ఆదిల్ రషీద్ ఒక్కడికే తుది జట్టులో చోటు కల్పించారు. లియామ్ లివింగ్‌స్టోన్ ఒక పార్ట్-టైమ్ స్పిన్నర్. ఇప్పుడు అతన్ని బట్లర్ పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. చెన్నై పిచ్‌ను పరిశీలిస్తే బట్లర్ ఒక మార్పు చేసి లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌కు జట్టులో స్థానం కల్పించే అవకాశం ఉంది. మరో ఆటగాడు జాకబ్ బెథెల్ పేరును కూడా పరిశీలిస్తున్నారు. కాగా టీమిండియాతో పోలిస్తే ఇంగ్లాండ్ స్పిన్ దళం బలహీనంగా కనిపిస్తోంది. ఇది వారికి తలనొప్పిగా మారవచ్చు. ఈ పరిస్థితిలో ఇంగ్లాండ్ పూర్తిగా బ్యాటింగ్‌పై ఆధారపడవలసి ఉంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2nd T20I
  • Chepauk
  • cricket news
  • India vs England
  • sports news

Related News

Former PCB CEO Wasim Khan Quits ICC

ICC: ఐసీసీ కీలక పదవి నుంచి వైదొలిగిన పీసీబీ మాజీ సీఈవో వాసిమ్ ఖాన్

ఐసీసీ జనరల్ మేనేజర్‌గా గత నాలుగేళ్లుగా సేవలందిస్తున్న వాసిమ్ ఖాన్, తాజాగా తన పదవి నుంచి తప్పుకున్నారు. 2022లో జెఫ్ అల్లార్డెస్ నుంచి ఈ బాధ్యతలను స్వీకరించిన ఆయన, తన పదవీ కాలం ముగియకుండానే వైదొలగడం గమనార్హం. వాసిమ్ ఖాన్ ఇంగ్లాండ్‌లో జన్మించి అక్కడే కౌంటీ క్రికెట్ ఆడారు. పాకిస్థాన్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినప్పటికీ, ఆయనకున్న అడ్మినిస్ట్రేటివ్ నైపుణ్యంతో 2019 నుండి మూడ

  • Hyderabad vs Delhi

    నేడు ర‌స‌వ‌త్త‌ర పోరు.. స‌న్‌రైజ‌ర్స్ విజ‌యాల‌కు ఢిల్లీ బ్రేక్ వేయ‌గ‌ల‌దా?

  • Chris Gayle

    కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

  • Jofra Archer

    షమీ రికార్డును సమం చేసిన ఆర్చర్!

  • Smriti Mandhana created history by surpassing Rohit Sharma to become India's leading T20I run scorer

    Smriti Mandhana: విరాట్ కోహ్లీ, రోహిత్ లను అధిగమించి స్మృతి మంధాన రికార్డ్ ..!

Latest News

  • ఏపీ మాజీ సీఎం క‌న్నుమూత‌

  • RTC: ఆర్టీసీ సమ్మె విరమించండి.. పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి..

  • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

  • టీడీపీ Vs జనసేన ప్రోటొకాల్‌ రగడ

  • Mega 158 : మెగాస్టార్ సినిమాలో.. విలన్ గా డింపుల్ హయాతి?

Trending News

    • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

    • అమెరికా, ఇజ్రాయెల్‌లకు బుద్ధి చెబుతాం: ఇరాన్

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd