Asia Cup Winners: 7 సార్లు ఆసియా కప్ టైటిల్ గెలిచిన భారత్
ఐర్లాండ్ సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ తదుపరిగా ఆసియా కప్ ఆడనుంది. ఇప్పటికే 17 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టుని బీసీసీఐ ప్రకటించింది
- By Praveen Aluthuru Published Date - 09:15 PM, Tue - 22 August 23
Asia Cup Winners: ఐర్లాండ్ సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ తదుపరిగా ఆసియా కప్ ఆడనుంది. ఇప్పటికే 17 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టుని బీసీసీఐ ప్రకటించింది. ఆసియా కప్ లో హాట్ ఫేవరేట్ జట్లు భారత్ పాకిస్థాన్ సెప్టెంబర్ 2న తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం యావత్ భారత్ ఎదురుచూస్తుంది. ఆసియా కప్ తరువాత ప్రపంచ కప్ ఉండటంతో ఆసియా కప్ కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు రెండు టోర్నీల్లో పోటాపోటీగా తలపడనున్నాయి. ఇక ఆసియా కప్ గణాంకాలు చూస్తే పాకిస్థాన్ పై భారత్ పైచేయి సాధించింది.
భారత్, పాకిస్తాన్ మధ్య మొత్తం 13 వన్డే మ్యాచ్లు జరిగాయి. ఇందులో టీమ్ ఇండియా 7 సార్లు నెగ్గింది. పాకిస్థాన్ 5 సార్లు గెలిచింది. ఇరు జట్లు తొలిసారి 1984 ఆసియా కప్లో ఆడాయి. ఇరు జట్లు ఇప్పటివరకు ఫైనల్స్లో మూడుసార్లు తలపడితే మూడుసార్లు పాకిస్థాన్ పై టీమిండియా విజయం సాధించింది .
ఆసియా కప్ చరిత్రలో ఇప్పటివరకు 15 సీజన్లు జరిగాయి. ఇందులో భారత జట్టు 1984, 1988, 1990–91, 1995, 2010, 2016, 2018 సార్లు అత్యధికంగా 7 సార్లు టైటిల్ను గెలుచుకుంది. శ్రీలంక 6 సార్లు ఛాంపియన్గా నిలిచింది. పాకిస్థాన్ 2000, 2012 కేవలం రెండుసార్లు మాత్రమే టైటిల్ గెలుచుకోగలిగింది.
ఇదిలా ఉంటె ప్రస్తుతం పాకిస్థాన్ టీమిండియా జట్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి. పైగా ఇరు జట్ల ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. ఈ సారి అసియా కప్ లో ఈ రెండు జట్ల మధ్య సాగె మ్యాచ్ లకు హ్యుజ్ రెస్పాన్స్ వచ్చే అవకాశముంది. డిజిటల్ పరంగా కూడా భారీ వ్యూవర్షిప్ వస్తుందంటున్నారు విశ్లేషకులు.
Also Read: Tribal People: అడవి బిడ్డల జీవితాల్లో వెలుగు నింపుతున్న విద్యుత్ ఉద్యోగి
Related News
Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. రహస్యంగా ఉంచాలని కోరిన ఐసీసీ..!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు క్వాలిఫైయింగ్ మ్యాచ్లన్నీ ఒకే నగరంలో జరగాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంటే ICCకి సూచించింది.