Tribal People: అడవి బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపుతున్న విద్యుత్ ఉద్యోగి
ట్రాన్స్ కో సహాయ గణంకాధిరిగా పనిచేస్తూ తన సాలరీ నుంచి ప్రతి నెల 20 శాతం సేవా కార్యక్రమానికి ఖర్చు చేస్తున్నాడు.
- By Balu J Published Date - 05:24 PM, Tue - 22 August 23
వారంతా అడవి బిడ్డలు.. బాహ్యా ప్రపంచానికి దూరంగా ఉండే గిరిపుత్రులు, టెక్నాలజీ ఏంటో తెలియని అమాయక ఆదివాసీలు. చిన్న పూరిగుడెసి లో ఉంటూ అడవిలో దొరికే వాటితో జీవనం కొనసాగిస్తుంటారు. ఒక్క మాటలో అవన్నీ ఎవరికి తెలియని చెంచు పెంటలు. ఏ నాయకుడు కూడా అక్కడికి వెళ్లంది లేదు. ఏ అధికారి వారి బాధలను విన్నది లేదు. ఈ ఇలాంటి దయనీయ ద్రుశ్యాలు విద్యుత్ ఉద్యోగి కళ్లెం శ్రీనివాస్ రెడ్డిని కదిలించాయి. వేతనంలో కొంత డబ్బును ఆదా చేస్తూ గిరిజనులకు కావాల్సిన వసతులను సమకూరుస్తున్నాడు కళ్లెం శ్రీనివాస్.
చాలామందికి శ్రీశైలం అనగానే అందమైన ద్రుశ్యాలు, వివిధ అటవీ జంతువులు, పచ్చదనం పరుచుకునే ప్రక్రుతి అందాలు గుర్తుకు రావడం కామన్. కానీ శ్రీనివాస్ రెడ్డికి మాత్రం వాటితో పాటు ప్రపంచానికి దూరంగా ఉన్నా గిరిపుత్రులు గుర్తుకువస్తారు. వాళ్ల కోసం ఏదైనా చేయాలని భావించి వెంటనే అడవిలో ఒకరోజు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ట్రాన్స్ కో సహాయ గణంకాధిరిగా పనిచేస్తూ తన సాలరీ నుంచి ప్రతి నెల 20 శాతం సేవా కార్యక్రమానికి ఖర్చు చేస్తున్నాడు.
అడవి బిడ్డల కోసం
స్వతహాగా సోషల్ వర్కర్ అయిన శ్రీనివాస్ రెడ్డి ఎంతోమందికి సాయం చేశాడు. ఓసారి శ్రీశైలం నల్లమల అటవీ ప్రాంతాలను సందర్శించినప్పుడు గిరిజనుల బాధలను చూసి చలించిపోయాడు. తన సేవలు కేవలం పట్టణాలకే పరిమితం కాకూడదని నిర్ణయించుకున్నాడు. వెంటనే అడవిలో ఒకరోజు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాంలో ఉంటున్న చెంచు గ్రామాలకు వెళ్లి అక్కడ పేదలకు వంట, నిత్యవసర సరుకులు, దుప్పట్లు, ఇంటి సామాగ్రితో పాటు పిల్లలకు ఆటబొమ్మలను అందిస్తున్నాడు. శ్రీనివాస్ రెడ్డి సేవా కార్యక్రమాలు తెలిసి ఇతర ఎన్జీ వో సంస్థలు, తోటి ఉద్యోగులు ఆయనకు సహకారం అందిస్తున్నారు. వారిందరి సహకారంతో ఆమ్రబాద్, మల్లాపూర్, పుల్లాయిపల్లి, రామ్ కుమార్, చెంచుపెంట లాంటి 80 కుటుంబాలకు కావాల్సినవి అందించారు. శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమాలు అక్కడి పోలీసులను కూడా కదిలించాయి.
నిరుపేదలకు కంటి వెలుగు
తెలంగాణలోని చాలా మారుమూల గ్రామాల్లో ఉండే పేదలు రోగమొచ్చినా ఏవిధంగా వైద్య సాయం పొందాలో తెలియదు. ఇక కంటి సమస్యలు వస్తే తమను తాము తిట్టుకుంటూ అలాగే జీవితాలు వెళ్లదీస్తుంటారు. అలాంటివారిని చూసి చలించిపోయాడు. లయన్స్ క్లబ్ మెంబర్ కావడంతో శ్రీనివాస్ రెడ్డి పలు జిల్లాల్లో క్యాంపులు నిర్వహిస్తున్నాడు. ఆ క్యాంపుల ద్వారా కంటి చూపు సమస్య ఉన్న వాళ్లను గురించి ఆస్పత్రులకు తరలిస్తుంటాడు. వారికి కావాల్సిన వైద్య సాయం చేస్తుంటాడు. ఇప్పటి వరకు 1600 మందికి ఆయన ఉచితంగా కంటి పరీక్షలు జరిగే లా చర్యలు తీసుకున్నాడు.
సేవా చేయడం ఇష్టం : కళ్లెం శ్రీనివాస్ రెడ్డి
ఒకొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది. ఒకరికి ఆటలంటే ఇష్టం, ఇంకొకరికి పాటలు అంటే ఇష్టం, మరికొరికి సినిమాలు అంటే ఇష్టం. నాకు మాత్రం సోషల్ సర్వీస్ చేయడం చాలా ఇష్టం. ఏమాత్రం సమయం దొరికినా సేవా కార్యక్రమాలకే సమయం కేటాయిస్తుంటా. ఇక మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తా.
Related News
Pawan Kalyan : జగన్ కు పదవి గండం ఉందని ఆ మహా కుంభాభిషేకం చేయడం లేదు
శ్రీశైలంలో దక్షిణాయణంలో మల్లికార్జున స్వామి కి మహా కుంభాభిషేకం చేస్తే జగన్ కు పదవి గండం ఉందని కొందరు జ్యోతిష్యులు చెప్పడంతో గత రెండుసార్లు వాయిదా వేశారని..పవన్ పేర్కొన్నారు