HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Sports
  • >Asia Cup 2025 Bcci Plan On India Pakistan Match

Asia Cup 2025: ఆసియా కప్‌లో ఇండియా-పాక్ మ్యాచ్‌ సాధ్యమేనా? బీసీసీఐ ఆలోచ‌న ఇదేనా!

ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC)లో భారతదేశం ఆధిపత్యం సాధిస్తోంది. భారత్ పాకిస్తాన్‌తో ఆడకపోతే టోర్నమెంట్ ఆదాయం దెబ్బతింటుంది. ఇది ఏసీసీలో భారతదేశం ప్రతిష్టను దెబ్బతీస్తుంది.

  • By Gopichand Published Date - 02:49 PM, Thu - 21 August 25
  • daily-hunt
India Without Sponsor
India Without Sponsor

Asia Cup 2025: అంతర్జాతీయ మ్యాచ్‌లలో పాకిస్తాన్‌ను బహిష్కరించాలన్న డిమాండ్లు పెరుగుతున్న తరుణంలో BCCI వైఖరి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మాత్రం ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో ఆడాలనే పట్టుదలతో ఉంది. ఈ విషయంలో 2008 నాటి వైఖరిని ప్రస్తుత ప్రభుత్వం తీసుకోవడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

2008లో ముంబైపై ఉగ్రదాడి జరిగిన తర్వాత అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లను రద్దు చేశారు. ఇది దేశభక్తికి, ఉగ్రవాదాన్ని వ్యతిరేకించడానికి ప్రతీకగా నిలిచింది. కానీ ఇప్పుడు 2025లో పరిస్థితి భిన్నంగా ఉంది. కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగి 26 మంది అమాయకులు చనిపోయిన తర్వాత కూడా సెప్టెంబర్ 9 నుంచి యుఏఈలో జరగనున్న ఆసియా కప్‌లో (Asia Cup 2025) భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లకు బీసీసీఐ సిద్ధమవుతోంది.

పాకిస్థాన్‌కు ఉచిత పాయింట్లు ఇవ్వకూడదన్న వ్యూహం

భారత్ పాకిస్తాన్‌ను బహిష్కరిస్తే పాకిస్థాన్‌కు మ్యాచ్ గెలవడానికి ఉచిత పాయింట్లు లభిస్తాయి. ఈ పాయింట్లతో పాకిస్తాన్ సులభంగా ఫైనల్‌కు, చివరికి టోర్నమెంట్ ఛాంపియన్‌గా మారే అవకాశం ఉంటుంది. దీన్ని నివారించేందుకే తాము పాకిస్తాన్‌తో ఆడాలని భావిస్తున్నామని బీసీసీఐ అధికారులు తెలిపారు.

Also Read: AP Cabinet Meeting : సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ

ఆసియా క్రికెట్‌లో ఆధిపత్యాన్ని కాపాడుకోవడం

ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC)లో భారతదేశం ఆధిపత్యం సాధిస్తోంది. భారత్ పాకిస్తాన్‌తో ఆడకపోతే టోర్నమెంట్ ఆదాయం దెబ్బతింటుంది. ఇది ఏసీసీలో భారతదేశం ప్రతిష్టను దెబ్బతీస్తుంది. దీంతో పాకిస్థాన్ ఇతర ఆసియా దేశాలను భారతదేశానికి వ్యతిరేకంగా మార్చడానికి ప్రయత్నించవచ్చని బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేసింది.

ఐసీసీలో రాజకీయ ప్రాబల్యం

ఐసీసీలో భారత్ బలంగా ఉండటానికి ఆసియా దేశాల మద్దతు ప్రధానం. ఏ విషయంపైన అయినా ఓటింగ్ అవసరమైతే పాకిస్తాన్‌తో సహా చాలా ఆసియా దేశాలు భారతదేశానికి మద్దతు ఇస్తాయి. జై షాను ఐసీసీ ఛైర్మన్‌గా చేయడానికి కూడా పాకిస్తాన్ మద్దతు ఇచ్చింది. పాకిస్తాన్‌ను బహిష్కరిస్తే ఈ ఐక్యత దెబ్బతిని ఐసీసీలో భారతదేశం స్థానం బలహీనపడవచ్చు.

బ్రాడ్‌కాస్టర్ల నష్టాన్ని నివారించడం

భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లే టోర్నమెంట్‌కు అధిక ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. 2024లో తదుపరి నాలుగు ఆసియా కప్‌ల ప్రసార హక్కులను $170 మిలియన్లకు (దాదాపు రూ. 1500 కోట్లు) విక్రయించారు. పాకిస్థాన్‌తో భారత్ ఆడకపోతే ఈ మ్యాచ్‌ల ద్వారా వచ్చే భారీ ఆదాయం ఉండదు. బ్రాడ్‌కాస్టర్లు భారీగా నష్టపోతారు. దీనివల్ల భవిష్యత్తులో బీసీసీఐపై వారి విశ్వసనీయత తగ్గుతుంది. ఈ నాలుగు కారణాలు దేశభక్తిని, ఉగ్రవాదంపై వ్యతిరేకతను పక్కనపెట్టి ఆర్థిక ప్రయోజనాలకే బీసీసీఐ ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం కూడా ప్రజలను నిరాశకు గురిచేస్తోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Asia Cup 2025
  • BCCI
  • ICC
  • India vs Pakistan Match
  • sports news

Related News

Amit Mishra

Amit Mishra: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మ‌రో టీమిండియా క్రికెట‌ర్‌!

ఏఎన్ఐతో మాట్లాడిన అమిత్ మిశ్రా.. "నా కెరీర్‌లో నేను అరంగేట్రం చేసిన తర్వాత ఐదేళ్ల గ్యాప్ వచ్చింది. నాకు ఈ ఒక్క విషయంపై మాత్రమే బాధ ఉంది" అని అన్నారు.

  • BCCI Sponsorship

    BCCI Sponsorship: స్పాన్సర్‌షిప్ బేస్ ధరను పెంచిన బీసీసీఐ..!

  • BCCI President

    BCCI President: బీసీసీఐకి కొత్త అధ్య‌క్షుడు.. రేసులో ఉన్న‌ది వీరేనా?

  • Cricketers Retired

    Cricketers Retired: 2025లో ఇప్ప‌టివ‌రకు 19 మంది స్టార్ క్రికెట‌ర్లు రిటైర్మెంట్‌!

  • Fitness Test

    Fitness Test: కేఎల్ రాహుల్ సహా కొంతమంది ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై సస్పెన్స్?!

Latest News

  • Nara Lokesh : టీచర్ల గౌరవాన్ని దెబ్బతీసే వైసీపీ చర్యలు దుర్మార్గమైనవి : మంత్రి లోకేశ్‌

  • Telangana: హైకోర్టులో సంచలనం.. పిటిషనర్ ప్రవర్తనతో విచారణ నుంచి తప్పుకున్న జడ్జి

  • Wonderful : 5.2 కేజీలతో బాలభీముడు పుట్టాడు..ఎక్కడో తెలుసా..?

  • Trump : జపాన్ పై సుంకం 25 నుంచి 15 శాతానికి తగ్గింపు

  • Ajit Pawar : వివాదంలో అజిత్‌ పవార్‌.. మహిళా ఐపీఎస్ అధికారిణిపై అనుచిత వ్యాఖ్యలు

Trending News

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    • Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

    • GST Rates: జీఎస్టీ 2.0.. ఏయే వ‌స్తువులు త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd