On This Day: పాకిస్థాన్ ని వణికించిన కుంబ్లే..ఇదే రోజు 10 వికెట్లు తీసి
1999 ఫిబ్రవరి 7న భారత లెజెండరీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పాక్ బ్యాట్స్మెన్లను ఒక్కోక్కరిని పెవిలియన్ చేర్చడంతో క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ చరిత్రకు సాక్షిగా నిలిచింది.
- By Praveen Aluthuru Published Date - 10:48 PM, Wed - 7 February 24
On This Day: భారత్ తో పాకిస్థాన్ తలపడిన ప్రతిసారి ఎదో ఒకరకంగా మ్యాచ్ లేదా సిరీస్ హైలెట్ అవుతుంది. 1999 ఫిబ్రవరి 7 సరిగ్గా ఇదే రోజు ప్రపంచ క్రికెట్లో ఓ అద్భుతం జరిగింది. ఆ రోజు పాక్ ఆటగాడి కుట్ర ఫలించి ఉంటే ఈ అద్భుతం గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదేమో.
1999 ఫిబ్రవరి 7న భారత లెజెండరీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పాక్ బ్యాట్స్మెన్లను ఒక్కోక్కరిని పెవిలియన్ చేర్చడంతో క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ చరిత్రకు సాక్షిగా నిలిచింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ లో అనిల్ కుంబ్లే స్పిన్ ఉచ్చులో చిక్కుకుని దాయాది దేశం బ్యాటర్లు పేకమేడలా కూలింది. ఆ మ్యాచ్ లో కుంబ్లే ప్రదర్శన ఇప్పటికీ భారత క్రికెట్ అభిమానుల కళ్లల్లో మెదులుతూనే ఉంది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ లో పదికి పది మందీ కుంబ్లే స్పిన్ సుడిగుండంలో చిక్కుకున్నారు.
1999 సంవత్సరంలో రెండు టెస్టులు ఆడేందుకు దాయాదులు భారత్ కు వచ్చారు. చెన్నైలో తొలి టెస్టు జరిగింది. సచిన్ టెండూల్కర్ సెంచరీతో రాణించినా భారత్ 12 పరుగుల తేడాతో ఓడింది. ఢిల్లీలో రెండో టెస్టు మ్యాచ్ జరిగింది. రెండో టెస్టులో భారత్ ఓడితే అది భారత్ కు స్వదేశంలో అవమానమే. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్. 252 పరుగులకే ఆలౌట్ అయింది. అప్పటి స్టార్ బ్యాటర్లు శఠగోపన్ రమేశ్ 60, మహ్మద్ అజారుద్దీన్ 67 పరుగులతో రాణించారు. సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్, గంగూలీ, నయాన్ మోంగియా నిరాశపరచడంతో భారత్ భారీ లక్ష్యాన్ని విధించలేకపోయింది. అయితే బ్యాటర్లు విఫలమైనా బౌలర్లు మెరుగ్గా రాణించారు. ఫలితంగా పాక్ 172 పరుగులకే ఆలౌట్ అయింది. కుంబ్లే నాలుగు, హర్భజన్ 3, వెంకటేశ్ ప్రసాద్ రెండు వికెట్లు పడగొట్టారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైంది. టీమిండియా బ్యాటర్ రమేశ్ 96, గంగూలీ 62, జవగళ్ శ్రీనాథ్ 49 పరుగులతో భారీ స్కోర్ చేశారు. దీంతో భారత్ 339 పరుగులకు ఆలౌట్ అయింది.
తొలి ఇన్నింగ్స్ లో కలుపుకుని టీమిండియా పాకిస్తాన్ ఎదుట 420 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.అయితే లక్ష్య ఛేదనలో పాక్ ఏ మాత్రం తడబడలేదు.సయీద్ అన్వర్ 69, అఫ్రిది 41 లు తొలి వికెట్ కు 101 పరుగులు జోడించారు. అప్పుడు కుంబ్లే స్పిన్ మాయాజాలం ప్రారంభమైంది. 24వ ఓవర్లో కుంబ్లే తొలి వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత వికెట్లు టపటపా నేలకూలాయి. జీరో, ఒకటి, ఐదు, పది ఈ రకమైన పరుగులతో పాక్ బ్యాటర్లు పెవిలియన్ కు చేరారు. మొత్తంగా కుంబ్లే ఈ మ్యాచ్ లో 26.3 ఓవర్లు బౌలింగ్ చేసి 74 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్ లో కుంబ్లేకు 10 వికెట్ల గౌరవం దక్కకూడదని పాక్ బ్యాటర్లు భారీ కుట్రకు ప్లాన్ చేశారు. పాక్ కెప్టెన్ వసీం అక్రమ్, యూనిస్ క్రీజులో ఉన్నారు. అప్పటికే తొమ్మిది వికెట్లు తీసిన కుంబ్లే ఒక్క వికెట్ తీస్తే చరిత్ర తిరగరాసినవాడుతాడు. కానీ యూనిస్ కావాలనే రనౌట్ కావాలనుకున్నాడు. ఇలా రనౌట్ అయితే ఆ వికెట్ కుంబ్లే ఖాతాలోకి వెళ్ళదు. బట్ ఈ కుట్ర విజయవంతం కాలేదు. యూనిస్ కంటే ముందే వసీం అక్రమ్ కుంబ్లేకి బలి అయ్యాడు. ఇలా కుంబ్లే ఖాతాలో పాకిస్థాన్ పదిమంది బ్యాటర్లు చిక్కుకున్నారు. కాగా ఈ ఘనతకు 24 ఏండ్లు నిండటంతో బీసీసీఐ కుంబ్లే పది వికెట్ల వీడియోను ట్విటర్ లో షేర్ చేసింది.
Also Read: Hyderabad: హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
Related News
PM Modi : పాక్లో కరెంటు లేదు..పిండి లేదు..చివరికి గాజులు కూడా లేవా?: ప్రధాని మోడీ
Prime Minister Modi: నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఫరూక్ అబ్దులా(Farooq Abdullah)చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ(PM Modi) కౌంటర్ వేశారు. పాకిస్థాన్ వద్ద కేసుకోవడానికి గాజులేమీ లేకపోతే..తాము పాకిస్థాన్(Pakistan)కు గాజులు తొడిగిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. We’re now on WhatsApp. Click to Join. సోమవారం బీహార్(Bihar) లోని ముజఫర్ పూర్(Muzaffarpur) పర్యటించిన ప్రధాని మోడీ.. ఫరూక్ అబ్దుల్లా పేరును ప్రస్తావించకుండా గట్టి కౌంటర్ ఇచ్చార