Telangana Women: సెమీఫైనల్ స్ఫూర్తితో తెలంగాణ మహిళలకు భవిత!
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మొదటి అడుగు మాత్రమే కాగా.. భారత్ ఫ్యూచర్ సిటీ అసలు ప్రారంభ వేదికగా నిలవనుంది. సెమీఫైనల్ విజయం భారత మహిళల స్థైర్యాన్ని నిరూపించగా, ఇప్పుడు తెలంగాణ ఆ శక్తికి సరైన వేదికను, శిక్షణను అందించడానికి సిద్ధంగా ఉంది.
- Author : Gopichand
Date : 31-10-2025 - 5:35 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana Women: ఆస్ట్రేలియాపై భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన చారిత్రక సెమీఫైనల్ విజయంతో దేశమంతటా హర్షధ్వానాలు మారుమోగుతున్నాయి. రిచా ఘోష్ బ్యాట్ నుండి బౌండరీకి దూసుకెళ్లిన బంతి భారత మహిళా శక్తిని ప్రపంచానికి చాటింది. ఈ విజయం స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మల వీరోచిత ప్రదర్శన మాత్రమే కాదు. ఇది తెలంగాణ మహిళల (Telangana Women) భవితవ్యానికి కొత్త పునాది వేసింది.
దేశం ఆనందంలో మునిగిపోయిన ఈ శుభ సమయంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో “భారత్ ఫ్యూచర్ సిటీ” పేరుతో ఒక విప్లవాత్మక ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది. మహిళా శక్తి వికాసాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన ఈ ప్రాజెక్ట్లో వరల్డ్-క్లాస్ స్పోర్ట్స్ యూనివర్శిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ నూతన వ్యవస్థ తెలంగాణ బాలికల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా రూపొందించబడింది. సాధారణంగా మహిళా అథ్లెట్లు క్రీడా జీవితానికి ఆర్థిక భవిష్యత్తుకు మధ్య ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈ సమస్యను భారత్ ఫ్యూచర్ సిటీ తొలగించనుంది.
రాష్ట్ర ప్రణాళికా అధికారుల వివరణ ప్రకారం.. ఒక యువ అథ్లెట్ స్పోర్ట్స్ యూనివర్శిటీలో ఒలింపిక్స్ కోసం శిక్షణ పొందుతూనే సైమల్టేనియస్గా స్కిల్ యూనివర్శిటీలో స్పోర్ట్స్ మేనేజ్మెంట్, ఫిజియోథెరపీ, లేదా డిజిటల్ మీడియా వంటి కోర్సులను కూడా నేర్చుకోవచ్చు. దీని వల్ల వారు కేవలం ఆటగాళ్లుగానే కాకుండా, సమర్థవంతమైన లీడర్గా, బ్రాండ్గా, ప్రొఫెషనల్గా ఎదుగుతారు అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం ఇదే. ఉదయం క్రికెట్ పిచ్పై కవర్ డ్రైవ్ సాధన చేసే యువ క్రీడాకారిణి, మధ్యాహ్నం క్లాస్రూమ్లో తన ఆర్థిక భవిష్యత్తును పథకం వేసుకునే శిక్షణ పొందగలదు.
Also Read: Australia Beat India: ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర ఓటమి!
భారత్ మహిళా క్రికెట్ జట్టు విజయం ఈ ప్రాజెక్ట్ దృష్టికి మరింత వేగాన్నిచ్చింది. స్థానిక కోచ్లు సైతం ఈ విజయాన్ని తమ కొత్త సిలబస్గా ప్రకటించారు. ప్రతి యువతికి నీ కల నిజం కావచ్చు అనే స్పష్టమైన సందేశం అందింది. భారత్ ఫ్యూచర్ సిటీ ద్వారా ఆ కలను చేరుకునే సాధనాలను మేము అందిస్తున్నాం అని వారు పేర్కొన్నారు.
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మొదటి అడుగు మాత్రమే కాగా.. భారత్ ఫ్యూచర్ సిటీ అసలు ప్రారంభ వేదికగా నిలవనుంది. సెమీఫైనల్ విజయం భారత మహిళల స్థైర్యాన్ని నిరూపించగా, ఇప్పుడు తెలంగాణ ఆ శక్తికి సరైన వేదికను, శిక్షణను అందించడానికి సిద్ధంగా ఉంది.