HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ysrtp Chief Ys Sharmila Meets Dk Shivakumar In Karnataka

YS Sharmila: డీకేతో భేటీ అయిన షర్మిల.. డీల్ ఫిక్స్ అయినట్టేనా?

వైఎస్ఆర్టీపి పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ రోజు సోమవారం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ని కలిశారు. కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఎన్నికైనందుకు ఆమె అభినందనలు తెలిపారు.

  • Author : Praveen Aluthuru Date : 29-05-2023 - 2:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YS Sharmila
Whatsapp Image 2023 05 29 At 2.40.33 Pm

YS Sharmila: వైఎస్ఆర్టీపి పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఈ రోజు సోమవారం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ని కలిశారు. కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఎన్నికైనందుకు ఆమె అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆమె బెంగుళూరులోని డీకే శివకుమార్ ఛాంబర్ లో కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా జరిగిన కర్ణాటక ఎన్నికల్లో డీకే కీలక పాత్ర పోషించాడని, కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు వెనుక శివకుమార్ పాత్ర ఎంతో ఉన్నదని ఆమె అన్నారు. ఈ సందర్భంగా డీకేతో రాజకీయ చర్చలు జరిపారు. ఈ భేటీలో డీకే శివకుమార్ వైఎస్ రాజశేఖర రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పేరు మారుమ్రోగింది. అధికార పార్టీని వెనక్కినెట్టి అక్కడ భారీ మెజారీటీతో గెలుపొందింది. అక్కడ బీజేపీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో అక్కడ కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ (DK Shivakumar) లు ఎన్నికయ్యారు. కర్ణాటక ఫలితాల తరువాత కాంగ్రెస్ చూపు తెలంగాణపై పడింది. తెలంగాణాలో వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేంద్రంగా కాంగ్రెస్ పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలతో మంతనాలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. తెలంగాణాలో బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ షర్మిలతో ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తుంది. గంటపాటు జరిగిన ఫోన్ సంభాషణలో తెలంగాణ రాజకీయాలపై కూలంకషంగా చర్చించినట్టు సమాచారం

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన షర్మిల అధికార పార్టీ బీఆర్ఎస్ పై ఎప్పటికప్పుడు విమర్శలతో విరుచుకుపడుతుంది. రాష్ట్రంలో అధికార పార్టీ తప్పులను ఎత్తిచూపుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుందామె. తాజాగా షర్మిల ప్రియాంక గాంధీతో సంభాషణ తరువాత కాంగ్రెస్, వైఎస్ఆర్టీపి పార్టీల మధ్య సంధి కుదిరినట్టు స్పష్టం అవుతుంది. తెలంగాణాలో కాంగ్రెస్, వైఎస్ఆర్టీపి పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్టు, సీఎం కెసిఆర్ ని గద్దె దెంచడమే లక్ష్యంగా ఆ రెండు పార్టీలు సన్నద్ధమైనట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలో డీకే శివకుమార్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా పావులు కదుపుతున్నారు. వైఎస్ఆర్ తో తనకున్న సాన్నిహిత్యంతో శివకుమార్ షర్మిలతో ఇప్పటికే మాట్లాడినట్టు నెక్స్ట్ ఎలెక్షన్స్ ని టార్గెట్ చేస్తూ ఇరు పార్టీలు బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసినట్టు భావిస్తున్నారు.

తెలంగాణాలో బీఆర్ఎస్ బలమైన పార్టీగా ఎదిగింది. కెసిఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారి జాతీయ పార్టీగా అవతరించింది. దీంతో తెలంగాణాలో ఆ పార్టీకి మరింత బలం చేకూరింది. దీంతో తెలంగాణాలో కెసిఆర్ లాంటి బలమైన నాయకుడిని ఢీ కొట్టాలంటే కాంగ్రెస్ తో మాత్రమే సాధ్యమయ్యే పని కాదు. ఈ నేపథ్యంలో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుంటే అధికారం చేపట్టాలని భావిస్తోంది కాంగ్రెస్. దీంట్లో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానం దృష్టి వైఎస్ షర్మిలపై పడిందని తెలుస్తోంది. ఇటువంటి సమయంలో షర్మిల కర్ణాటక వెళ్ళి కర్ణాటకలో కాంగ్రెస్ విజయంలో కీలకంగా వ్యవహరించిన డీకే శివకుమార్‌తో సమావేశం కావటం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

Read More: Delhi Jagan : చీక‌ట్లో ఆ 2గంట‌లు సీక్రెట్‌, జ‌గ‌న్ హ‌స్తిన అవ‌లోక‌నం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • cm kcr
  • congress
  • DK Shivakumar
  • karnataka
  • Priyanka gandhi
  • telangana congress
  • telangana politics
  • ys sharmila
  • ysrtp

Related News

Telangana Speaker G Prasad Kumar

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

Telangana Speaker Dismissed Disqualification Petition On Brs Mlas : పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌‌పై తెలంగాణ స్పీకర్ తీర్పు వెలువరించారు. మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు ఎక్కడా పార్టీ మారినట్టు ఆధారాలు లేవని ఆయన తేల్చిచెప్పారు. కాగా, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి. కాంగ్రెస్ విజయం సాధించి అధికారం చేపట

  • KTR

    కేటీఆర్ వెనుకబడిన ఆలోచనలతోనే బీఆర్‌ఎస్ పతనం.. కాంగ్రెస్ ఫైర్

  • Lok Sabha

    లోక్‌స‌భ‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ బిల్లు!

  • Karnataka Mid Day Meal Wor

    కర్ణాటకలో పురుగులు పట్టిన బియ్యంతో విద్యార్థులకు భోజనం!

  • Priyanka Be Given The Respo

    ప్రియాంక చేతికి ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు?

Latest News

  • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

  • 11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

  • ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

  • 2026 నూతన సంవత్సర లో ఇలా దైవ మంత్రాలతో కలిపి చెప్పేయండి!

  • AP లో సచివాలయాల పేరు మార్పు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!

Trending News

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd