Trainee Plane Crash: గుడి గోపురాన్ని ఢీకొన్న ట్రైనీ విమానం.. సీనియర్ పైలట్ మృతి
మధ్యప్రదేశ్లోని రేవాలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రైనీ విమానం (Trainee Plane) ఆలయ గోపురంపైకి దూసుకెళ్లింది. దీంతో విమానంలో ఉన్న పైలట్, ట్రైనీ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో సీనియర్ పైలట్ మృతి (Pilot Died) చెందాడు. మీడియా కథనాల ప్రకారం.. ప్రైవేట్ శిక్షణా సంస్థకు చెందిన విమానం ఆలయం గోపురం, విద్యుత్ వైర్లను తాకి కుప్పకూలింది.
- By Gopichand Published Date - 09:54 AM, Fri - 6 January 23
మధ్యప్రదేశ్లోని రేవాలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రైనీ విమానం (Trainee Plane) ఆలయ గోపురంపైకి దూసుకెళ్లింది. దీంతో విమానంలో ఉన్న పైలట్, ట్రైనీ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో సీనియర్ పైలట్ మృతి (Pilot Died) చెందాడు. మీడియా కథనాల ప్రకారం.. ప్రైవేట్ శిక్షణా సంస్థకు చెందిన విమానం ఆలయం గోపురం, విద్యుత్ వైర్లను తాకి కుప్పకూలింది. చౌరహతా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమ్రి గ్రామంలోని దేవాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఓ పైలట్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా ఒక పైలట్ తీవ్రంగా గాయపడ్డాడు. సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చేరిన వారు. ఈ ప్రమాదంలో విమానం కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Minor Girl Raped: వరంగల్ లో దారుణం.. మైనర్ బాలికపై 6 నెలలుగా అత్యాచారం
Related News
Varanasi Lok Sabha : ప్రధాని మోడీపై పోటీ.. 25వేల ఒక రూపాయి నాణేలతో నామినేషన్
ఆయన దగ్గర ఆస్తిపాస్తులు లేవు. కానీ చిల్లర బాగా ఉంది.