Road Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి
తమిళనాడులోని దుండికల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. శబరిమలకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
- By Praveen Aluthuru Published Date - 06:50 AM, Mon - 18 December 23
Road Accident: తమిళనాడులోని దుండికల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. శబరిమలకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అయ్యప్ప భక్తులతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు భక్తులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి విచారణకు ఆదేశించారు. మృతులు ములుగు జిల్లా కమలాపురం వాసులుగా గుర్తించారు.
Also Read: Irrigation Projects : జల ప్రాజెక్టుల చిట్టా తీయండి.. ఇరిగేషన్ అధికారులకు సీఎం ఆర్డర్
Related News
Heavy Heat Waves in Telangana : నిన్న ఒక్కరోజే వడదెబ్బకు 19 మంది మృతి
ఈ ఎండలకు తట్టుకోలేక చాలామంది మృత్యువాత పడుతున్నారు. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు 19 మంది మృతి చెందారంటే అర్ధం చేసుకోవాలి.