Terrorist Attack: ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి.. జమ్మూకశ్మీర్లో ఘటన!
జమ్మూకశ్మీర్లోని రాజౌరీలోని భారత ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడికి (Terrorist Attack) పాల్పడిన మరో ఘటన వెలుగు చూసింది.
- Author : Gopichand
Date : 07-07-2024 - 10:53 IST
Published By : Hashtagu Telugu Desk
Terrorist Attack: జమ్మూకశ్మీర్లోని రాజౌరీలోని భారత ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడికి (Terrorist Attack) పాల్పడిన మరో ఘటన వెలుగు చూసింది. మంజ్కోట్ ప్రాంతంలోని గ్లుటి గ్రామంలోని ఆర్మీ పోస్ట్లో ఉన్న సైనికుడిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ సైనికుడు గాయపడ్డాడు. ఈ కాల్పుల్లో అప్రమత్తమైన భద్రతా పోస్ట్ వద్ద మోహరించిన సైనికుడు కూడా ఉగ్రవాదులపై కాల్పులు జరిపాడు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున 3:50 గంటలకు జరిగింది. చీకటిని సద్వినియోగం చేసుకొని ఉగ్రవాదులు తప్పించుకోవడంలో విజయం సాధించారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆర్మీ, పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై సైన్యం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
అయితే ఇటీవల కాలంలో దేశంలో ఉగ్రవాద దాడులు ఎక్కువయ్యాయి. ఏదో ఒక మూలన ఉగ్రవాదుల దాడి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సరిహద్దు ప్రాంతంలోని ప్రజలు ఏ సమయాన ఏం జరుగుతుందోనని భయంతో జీవిస్తున్నారు. సైనికులు సైతం పకడ్బందీగా గస్తీ కాస్తున్న ఉగ్రవాదులు ఏదో ఒక మార్గాన భారత్లోకి చొరబడి ఉగ్ర దాడులు చేస్తుండటం గమనార్హం.
Also Read: Ola Maps: గూగుల్ మ్యాప్స్కు గుడ్ బై చెప్పిన ఓలా.. ఇకపై ఓలా మ్యాప్స్పైనే రైడింగ్..!
ఐదుగురు ఉగ్రవాదులను ఆర్మీ హతమార్చింది
గతంలో జమ్మూకశ్మీర్లోని కుల్గామ్లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు. అయితే సైన్యం ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చింది. గతంలో రెండు వేర్వేరు చోట్ల ఉగ్రవాదులు ఉన్నారని సైన్యానికి సమాచారం అందింది. దీని తర్వాత సైన్యం యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ సమయంలోనే సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్కు సంబంధించి సమాచారం ఇవ్వగా.. జిల్లాలోని ఫ్రిసల్ చిన్నిగాం ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్కౌంటర్ జరిగినట్లు పోలీసులు తెలిపారు.
We’re now on WhatsApp : Click to Join
ఇటీవల జమ్మూకశ్మీర్లో పలు ఉగ్రవాద ఘటనలు వెలుగులోకి రావడం గమనార్హం. అంతకుముందు జూన్ 27న బుధవారం జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లా భదర్వా సెక్టార్లోని గండోహ్లో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. గత నెల జూన్ 9 సాయంత్రం జమ్మూకశ్మీర్లోని రియాసి జిల్లాలో ఉగ్రవాదుల దాడి తరువాత యాత్రికులతో నిండిన బస్సు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. 33 మంది గాయపడ్డారు.