Stock Market: నష్టాల్లో మార్కెట్ సూచీలు..!
దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) ఈరోజు కూడా నష్టాలతోనే ప్రారంభమైంది. బిఎస్ఇ సెన్సెక్స్ 205.06 పాయింట్లు లేదా 0.24 శాతం పతనంతో 70,165.49 వద్ద ప్రారంభమైంది.
- Author : Gopichand
Date : 24-01-2024 - 10:09 IST
Published By : Hashtagu Telugu Desk
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) ఈరోజు కూడా నష్టాలతోనే ప్రారంభమైంది. బిఎస్ఇ సెన్సెక్స్ 205.06 పాయింట్లు లేదా 0.24 శాతం పతనంతో 70,165.49 వద్ద ప్రారంభమైంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 53.55 పాయింట్లు లేదా 0.25 శాతం క్షీణతతో 21,185 వద్ద ప్రారంభమైంది.
BSE సెన్సెక్స్ షేర్ల పరిస్థితి
సెన్సెక్స్ షేర్లను పరిశీలిస్తే.. 30 షేర్లలో 19 లాభాలతో ట్రేడవుతుండగా, 11 క్షీణిస్తున్నాయి. సెన్సెక్స్లో టాప్ గెయినర్స్ను పరిశీలిస్తే.. ఇండస్ఇండ్ బ్యాంక్ అత్యధికంగా లాభపడింది. 1.60 శాతం లాభపడింది. టాటా స్టీల్ 1.36 శాతం, ఎస్బీఐ 1.23 శాతం చొప్పున పెరిగాయి. ఇన్ఫోసిస్ 1.05 శాతం, హెచ్సిఎల్ టెక్ 0.97 శాతం చొప్పున పెరిగాయి.
Also Read: PM Modi YouTube Channel : ప్రధాని మోడీ యూట్యూబ్ ఛానల్ మరో రికార్డ్.. ఏమిటో తెలుసా?
నిఫ్టీ స్టాక్స్ పరిస్థితి
50 నిఫ్టీ స్టాక్లలో 30 లాభపడగా, 20 స్టాక్లు క్షీణిస్తున్నాయి. నిఫ్టీలో అత్యధికంగా పెరుగుతున్న స్టాక్లలో హిందాల్కో 3.22 శాతం, మైండ్ట్రీ 1.07 శాతం ఎగబాకాయి. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్లో ఒక శాతం జంప్, కోల్ ఇండియా 0.99 శాతం పెరిగింది. ఇన్ఫోసిస్ 0.88 శాతం లాభంతో ట్రేడవుతోంది.
మార్కెట్ ప్రారంభానికి ముందు ఎలా ఉంది?
స్టాక్ మార్కెట్ ప్రీ-ఓపెనింగ్లో బిఎస్ఇ సెన్సెక్స్ 172.61 పాయింట్లు లేదా 0.21 శాతం పడిపోయి 70197 స్థాయి వద్ద ట్రేడవుతోంది. NSE నిఫ్టీ 89 పాయింట్లు లేదా 0.42 శాతం లాభంతో 21149 వద్ద ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
మార్కెట్ సెక్టోరల్ ఇండెక్స్
సెక్టోరల్ ఇండెక్స్లో ప్రస్తుతం ఆటో, రియల్టీ రంగ షేర్లు మాత్రమే రెడ్ మార్క్ను చూస్తున్నాయి. మిగిలిన అన్ని రంగాల సూచీలు గ్రీన్ బుల్లిష్ మార్క్తో ట్రేడవుతున్నాయి. మీడియా స్టాక్స్ అత్యధికంగా 1.89 శాతం లాభపడగా, మెటల్ స్టాక్స్ 1.76 శాతం పెరిగాయి. పీఎస్యూ బ్యాంకుల్లో 1.53 శాతం వృద్ధి కనిపిస్తోంది.