HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Staff Working At Annadanam Complex In Kanipakam Temple In Chittoor

Kanipakam Temple: జింక చర్మంతో పట్టుబడ్డ కాణిపాకం అర్చకుడు.. ఈవో చర్యలు

కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం (Kanipakam Temple)లో అధికారులు సోదాలు నిర్వహించగా పూజారి నివాసంలో జింక చర్మం కనిపించడంతో షాక్‌కు గురయ్యారు.

  • Author : Gopichand Date : 09-04-2023 - 9:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kanipakam Temple
Resizeimagesize (1280 X 720) 11zon

కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం (Kanipakam Temple)లో అధికారులు సోదాలు నిర్వహించగా పూజారి నివాసంలో జింక చర్మం కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. ఆలయ ప్రసాదాలు తయారు చేసే పోటు, గోదాం, అన్నదాన సత్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో శనివారం ఆలయ ఈఓ వెంకటేశుల ఆధ్వర్యంలో సిబ్బంది నివాసాల్లో సోదాలు నిర్వహించారు. వరసిద్ధి వినాయకస్వామి అనుబంధ ఆలయమైన వరదరాజులస్వామి ఆలయ పూజారి కృష్ణమోహన్ నివాసంలో జింక చర్మం లభ్యమైంది. ఈ విషయాన్ని ఈవో వెంకటేశులు అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో వారు అక్కడికి చేరుకున్నారు.

డీఎఫ్‌వో చైతన్యకుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు జింక చర్మాన్ని స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు కృష్ణమోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. జింక చర్మాన్ని ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు విచారణలో కృష్ణమోహన్ వెల్లడించారని, దానిని విక్రయించిన నిందితుల కోసం గాలిస్తున్నామని ఎఫ్‌ఆర్‌వో బాలకృష్ణారెడ్డి తెలిపారు. శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలోని అన్నసత్రం, గోదాము, పోటులో పనిచేస్తున్న సిబ్బందిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆలయ భద్రతా సిబ్బంది, ఈవో ఎ.వెంకటేశు శనివారం తెల్లవారుజామున వారి ఇళ్లపై దాడి చేశారు.

Also Read: Farooq Abdullah : మొఘల్ పాఠ్యాంశాల తొలగింపును ఖండించిన ఫరూక్ అబ్దుల్లా 

నలుగురు వంట మనుషుల ఇళ్లలో పెద్దఎత్తున బియ్యం, ఇతర వస్తువులు బస్తాలు బయటపడ్డాయి. చిన్నకాంపల్లె, గోడౌన్, పోటుకు చెందిన అన్నదాన సత్రంలో పనిచేస్తున్న మహిళ ఇళ్లలో బియ్యం, పంచదార, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. రోజూ 2,500 మందికి ఆహారం అందించడానికి అవసరమైన వస్తువులు, సేవలను గోదాము నుండి ముందు రోజు తీసుకుంటారు. వీటిలో కొందరూ వస్తువులను స్వస్థలాలకు తరలిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈవో అన్నదాన భవనం వద్ద రహస్యంగా సరుకులు తీసుకువెళుతున్న ఓ బైక్ ను వెంబడించి పట్టుకున్నారు. ఈ ఘటనతో ఆలయ సిబ్బంది అవకతవకలకు పాల్పడుతున్నట్లు నిర్దారణ కావడంతో ఈవో వెంకటేశ్ చర్యలు చేపట్టారు.

అర్చకులతో సహా ఆలయలంలో పని చేసేవారి నివాసాల్లో సోదాలు నిర్వహించి రూ.1.30 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు సిబ్బంది ఇళ్లలో సరుకులు స్వాధీనం చేసుకున్నట్లు ఈవో వెంకటేశు తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • Annadanam Complex
  • Chittoor
  • Cooking Materials
  • Deer skin
  • kanipakam temple

Related News

Pemmasani Chandrasekhar Ama

ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత మంత్రి పెమ్మసాని

భవిష్యత్తులో రాజధాని అమరావతిని ఎవరూ కదిలించకుండా శాశ్వత చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. 2024 నుంచే ఈ చట్టబద్ధత అమల్లోకి వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే అటార్నీ జనరల్‌తో చర్చలు జరిగాయని చెప్పారు. అమర

  • Ttd

    ఈ విశ్వంలో అసలైన సౌందర్యం…నిజమైన వైభవం అంటే అది వేంకటేశ్వరస్వామి వారిదే ..

  • Satya Kumar Dares Jagan

    జ‌గ‌న్‌కు మంత్రి స‌వాల్‌.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాల‌ని!

  • Political Party Banner

    తిరుమలలో రాజకీయ బ్యానర్ల కలకలం

  • Renamed Grama Ward Sachival

    AP లో సచివాలయాల పేరు మార్పు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!

Latest News

  • చికెన్ వండుతున్నారా? అయితే ఇలా శుభ్రం చేయండి!

  • ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్‌పై వేటు!

  • బాండీ బీచ్ దాడి.. వారికి ఆస్ట్రేలియా ప్రధాని క్షమాపణలు!

  • సరికొత్త అవతారంలో ‘రెనో డస్టర్’.. 2026 రిపబ్లిక్ డే రోజున గ్రాండ్ ఎంట్రీ!

  • టీ-20 ప్రపంచ కప్ 2026.. టీమిండియా ఓపెనింగ్ జోడీ ఎవరు?

Trending News

    • విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల త‌ర్వాత రోహిత్‌!

    • 2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్‌లు!

    • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

    • 2026 రిలేషన్‌షిప్ టిప్స్.. భాగస్వామి జీవితాన్ని మార్చే నిర్ణ‌యాలీవే!

    • బుర్జ్ ఖలీఫా రికార్డు గల్లంతు.. త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా జెడ్డా టవర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd