Modi: ఫకీరు కాదు: ఎంపీ సంజయ్ రౌత్
- By hashtagu Published Date - 02:10 PM, Mon - 3 January 22
శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై తనదైన శైలిలో విమర్శలు చేశారు. తన కాన్వాయ్లో మెర్సిడెస్-మేబ్యాక్ ఎస్ 650 కారును చేర్చుకోవడంతో ఇక నుంచి మోడీ ఫకీరు అని చెప్పుకొడని రౌత్ అన్నారు. ఈ మేరకు సామ్నా పత్రిక లో మోడీని ఉద్దేశించి ప్రస్తావించారు.మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు దేశీయంగా తయారైన కార్ను వినియోగించారని అన్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినప్పటికీ తన సెక్యూరిటీని ఇందిరా గాంధీ మార్చుకోలేదని గుర్తుచేశారు. తనను ఫకీరుగా, ప్రధాన సేవకుడిగా పిలుచుకునే వ్యక్తి విదేశీ కారును ఉపయోగిస్తున్నారు’ అని అన్నారు. స్వదేశీ ఉత్పత్తులు వాడమని ప్రజలకు చెబుతూ తాను మాత్రం విదేశీ కార్లను వినియోగిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాగా, ప్రధాని కాన్వాయ్లో మెర్సిడెస్-మేబ్యాక్ ఎస్ 650 గార్డ్ని ఇటీవలే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చేర్చింది.
Tags
Related News
Sanjay : నా అరెస్టుకు మోడీ కుట్ర..కేసీఆర్ కొత్త డ్రామా: బండి సంజయ్
Bandi Sanjay: మాజీ సీఎం కేసీఆర్(KCR)పై బీజేపీ జాతీయ ప్రధాని కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ(PM Modi)తనను అరెస్టు చేయించి జైలుకు పంపేందుకు ప్రయత్నించారని కేసీఆర్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ మాట్లాడుతూ..కేసీఆర్ మరో కొత్త డ్రామాకు తెరతీస్తున్నారని దుయ్యబట్టారు. అవినీతిని బీజేపీ ప్రభుత్వం �