National Flag At New Parliament: కొత్త పార్లమెంట్ భవనం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాజ్యసభ చైర్మన్.. వీడియో..!
సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముందు ఆదివారం ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కొత్త పార్లమెంట్ భవనంలో త్రివర్ణ పతాకాన్ని (National Flag At New Parliament) ఎగురవేశారు.
- By Gopichand Published Date - 10:18 AM, Sun - 17 September 23
National Flag At New Parliament: సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముందు ఆదివారం ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కొత్త పార్లమెంట్ భవనంలో త్రివర్ణ పతాకాన్ని (National Flag At New Parliament) ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు. ఈరోజు ప్రధాని మోదీ పుట్టినరోజు కావడం విశేషం. అలాగే విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఆదివారం ఉదయం 9.30 గంటలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ కొత్త పార్లమెంట్ భవనం ప్రాంగణానికి చేరుకుని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్రమంత్రి వీ మురళీధరన్, పీయూష్ గోయల్, అర్జున్ రామ్ మేఘ్వాల్, కాంగ్రెస్ ఎంపీలు అధిర్ రంజన్ చౌదరి, ప్రమోద్ తివారీ తదితరులు పాల్గొన్నారు.
#WATCH | Rajya Sabha Chairman and Vice President Jagdeep Dhankhar hoists the national flag at Gaj Dwar, the New Building of Parliament. pic.twitter.com/dwlGNDfjGq
— ANI (@ANI) September 17, 2023
ఈ కార్యక్రమానికి మల్లికార్జున్ ఖర్గే హాజరుకాలేదు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి తాను హాజరు కాలేనని ఇప్పటికే రాజ్యసభ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. తాను ప్రస్తుతం హైదరాబాద్లో సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరయ్యానని చెప్పారు.జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మల్లికార్జున్ ఖర్గేకు సెప్టెంబర్ 15 సాయంత్రం ఆహ్వానం అందింది.
#WATCH | Rajya Sabha Chairman and Vice President Jagdeep Dhankhar and Lok Sabha Speaker Om Birla meet Parliamentary Affairs Minister Pralhad Joshi, Union Ministers V Muraleedharan, Piyush Goyal, Arjun Ram Meghwal, Congress MPs Adhir Ranjan Chowdhury and Pramod Tiwari at the New… pic.twitter.com/bvyNEnd4St
— ANI (@ANI) September 17, 2023
సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక సమావేశానికి ఒకరోజు ముందు ఈ కార్యక్రమం జరిగింది. సెప్టెంబరు 18 నుంచి 22 వరకు జరిగే ప్రత్యేక సమావేశాలు పాత భవనంలో ప్రారంభమై కొత్త భవనానికి మారుస్తారు. మే నెలలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించిన కొత్త పార్లమెంట్లో జరిగే తొలి సెషన్ ఇదే కావడం విశేషం. పార్లమెంట్ ప్రత్యేక సమావేశానికి ముందు ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు అఖిలపక్ష సమావేశం కూడా జరగనుంది. పాత పార్లమెంట్ హౌస్లో కేబినెట్ మంత్రుల గదులు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండగా, ఇప్పుడు కొత్త పార్లమెంట్ హౌస్లో మొదటి అంతస్తులో వారి గదులను కేటాయించారు.
Tags
Related News
Traffic Diversion : రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు..
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.