Speed News
-
Vice President Election : ఉప రాష్ట్రపతి ఎన్నిక: ప్రారంభమైన పోలింగ్.. ఓటేసిన ప్రధాని మోడీ
సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న ఈ ఓటింగ్ అనంతరం, అదే రోజు రాత్రి 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీయే (NDA) అభ్యర్థిగా సీనియర్ నాయకుడు సి.పి. రాధాకృష్ణన్ (CP Radhakrishnan) పోటీ చేస్తున్నారు.
Date : 09-09-2025 - 10:49 IST -
AP : రైతుల సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ ‘అన్నదాత పోరు’ ..రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలు
రాష్ట్రవ్యాప్తంగా యూరియా, ఇతర రసాయన ఎరువుల కొరత తీవ్రంగా ఉండటం, ఉల్లి, టమోటా వంటి పంటలకు గిట్టుబాటు ధరల లభ్యతలో ప్రభుత్వం విఫలమవడం, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడమే ఈ పోరాటానికి కారణంగా పేర్కొంది.
Date : 09-09-2025 - 10:21 IST -
KTR : ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ పై తొలిసారి స్పందించిన కేటీఆర్..ఏమన్నారంటే..?
సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ఈ అంశంపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు. కవిత చేసిన ఆరోపణలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, కేటీఆర్ ఘాటు స్పందన ఇచ్చారు. ఇది ఒక్కరిపై తీసుకున్న నిర్ణయం కాదు. పార్టీ లోపల సమగ్రంగా చర్చించిన తర్వాతే అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Date : 08-09-2025 - 5:28 IST -
Vande Bharat : దీపావళికే ప్రత్యేక సౌకర్యాలతో పట్టాలెక్కనున్న సూపర్ ఫాస్ట్ సర్వీస్
Vande Bharat : భారతీయ రైల్వే ప్రయాణికులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వందే భారత్ స్లిపర్ ఎక్స్ప్రెస్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇప్పటివరకు వందే భారత్ రైళ్లు కేవలం చైర్కార్ మోడల్లో మాత్రమే నడుస్తున్నాయి.
Date : 08-09-2025 - 5:20 IST -
Bathukamma Sarees : ఆ మహిళలకే బతుకమ్మ చీరలు.. రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
Bathukamma sarees : బతుకమ్మ పండుగ సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం చీరల పంపిణీపై కీలక నిర్ణయం తీసుకుంది. గత విధానానికి భిన్నంగా కొత్త నిబంధనలను అమలు చేయనుంది.
Date : 08-09-2025 - 4:35 IST -
IAS Transfer : ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీ
. ఏ శాఖలో ఎవరు ఎలా పనిచేస్తున్నారన్న విషయాన్ని అర్థవంతంగా విశ్లేషించి, చక్కటి పరిపాలనకు దోహదపడేలా, మంచి పనితీరును ప్రోత్సహించేలా ఈ మార్పులు చేశారు. ఈ క్రమంలో పలువురు ముఖ్య ఐఏఎస్ అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారు.
Date : 08-09-2025 - 4:19 IST -
YS Sharmila : నా కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడు : వైఎస్ షర్మిల
ఈ ఉదయం షర్మిల తన కుమారుడు రాజారెడ్డితో కలిసి కర్నూల్ ఉల్లి మార్కెట్ను సందర్శించారు. అక్కడ రైతులతో ముఖాముఖి మాట్లాడిన ఆమె, ఉల్లి ధరల పతనంపై తీవ్రంగా స్పందించారు.
Date : 08-09-2025 - 2:48 IST -
KTR : కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ విషం చిమ్మింది
KTR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ రాజకీయ వాతావరణం మళ్లీ రగిలింది. ప్రాజెక్టును రాజకీయ లాభనష్టాల కోసం వాడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం విషప్రచారం చేస్తోందని, ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పి ఇప్పుడు శంఖుస్థాపన పేరుతో ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
Date : 08-09-2025 - 2:38 IST -
Dussehra Holidays : తెలంగాణలో దసరా సెలవులు ఎప్పటి నుంచంటే?
అధికారికంగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, పాఠశాలలకు సెప్టెంబర్ 21 (ఆదివారం) నుండి అక్టోబర్ 3 (శుక్రవారం) వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. అదే విధంగా, జూనియర్ కళాశాలలకు సెప్టెంబర్ 28 (ఆదివారం) నుండి అక్టోబర్ 5 (ఆదివారం) వరకు సెలవులను ప్రకటించారు.
Date : 08-09-2025 - 1:44 IST -
Jammu Kashmir : జమ్మూకాశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం!
Jammu Kashmir : జమ్మూకాశ్మీర్ మళ్లీ ఉగ్రవాదుల కాల్పులతో రణరంగాన్ని తలపించింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ప్రాంతమంతా హైఅలర్ట్లో ఉండగా, భద్రతా దళాలు ఉగ్రవాదుల వేటను మరింత తీవ్రతరం చేశాయి.
Date : 08-09-2025 - 10:51 IST -
TTD: రేపు ఎన్నిగంట్లకు టీటీడీలో దర్శనమంటే.?
TTD: చంద్రగ్రహణం సందర్భంగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల పుణ్యక్షేత్రం మూసివేశారు అర్చకులు. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం, గ్రహణ సమయంలో ఆలయ ద్వారాలను మూసి ఉంచడం సాంప్రదాయం.
Date : 07-09-2025 - 6:15 IST -
Congress : 15న కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ : మహేష్ కుమార్ గౌడ్
ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించనున్నట్టు మహేశ్కుమార్ గౌడ్ ప్రకటించారు. ఈ సభలో బీసీల సాధికారత, వారి రాజకీయ భాగస్వామ్యం గురించి పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం. బీసీలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదు అని తెలిపారు.
Date : 07-09-2025 - 5:48 IST -
Ganesh Visarjan 2025: హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనం వేళ విషాదం… ఇద్దరు మహిళల మృతి
Ganesh Visarjan 2025: హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జనోత్సవాలు ఈసారి విషాద ఛాయలు మిగిల్చాయి. ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు ప్రజలను షాక్కు గురి చేశాయి.
Date : 07-09-2025 - 5:07 IST -
HPCL : పెట్రోలియం కంపెనీపై పిడుగు.. భారీగా చెలరేగిన మంటలు
ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను నియంత్రించేందుకు శ్రమించాయి. మంటలు ఒక్కసారిగా భారీ ఎత్తున ఎగిసి పడటంతో, పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Date : 07-09-2025 - 4:52 IST -
Japan : జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా రాజీనామా ప్రకటన
అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) లో పెరుగుతున్న అంతర్గత విభేదాలు, పార్టీ శ్రేణుల్లో నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. జులైలో జరిగిన పార్లమెంటరీ ఎలక్షన్లలో LDPకి నిరాశాజనక ఫలితాలు దక్కాయి.
Date : 07-09-2025 - 4:34 IST -
BRS : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ జోరు..రాష్ట్ర పర్యటనలకు సిద్ధమవుతున్న కేటీఆర్
పార్టీ మళ్లీ ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు ఇది కీలకంగా మారనుంది. అధికారంలో ఉన్నప్పటి గ్లోరీని మళ్లీ సాధించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. ఈ నెల 10, 11 తేదీల్లో కొత్తగూడెం మరియు భద్రాచలం నియోజకవర్గాల్లో కేటీఆర్ పర్యటించనున్నారు.
Date : 07-09-2025 - 2:34 IST -
Mumbai : చెత్త ఏరిన సీఎం భార్య, స్టార్ హీరో
Mumbai : ఈ కార్యక్రమంలో ఆమె బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్(Akshay Kumar)తో కలిసి పాల్గొన్నారు. నిమజ్జనాల కారణంగా బీచ్ మొత్తం అపరిశుభ్రంగా మారడంతో, దానిని శుభ్రం చేసి
Date : 07-09-2025 - 12:18 IST -
Heavy Rain in Warangal : వరంగల్ ను ముంచెత్తిన భారీ వర్షం
Heavy Rain in Warangal : భారీ వర్షాల కారణంగా నగరంలోని అండర్ బ్రిడ్జి దగ్గర రెండు ఆర్టీసీ బస్సులు వరద నీటిలో చిక్కుకున్నాయి. ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు
Date : 07-09-2025 - 11:35 IST -
Ganesh Laddu: వేలంలో గణేశ్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం మహిళ
Ganesh Laddu: తెలంగాణ రాష్ట్రం నిర్మల్ పట్టణంలో మతసామరస్యం అద్భుతంగా వెల్లివిరిసింది. హిందూ సాంప్రదాయ పండుగ అయిన వినాయక చవితి సందర్భంగా ఈద్గాం ఆదర్శ్ నగర్ గణపతి లడ్డూ వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Date : 07-09-2025 - 10:27 IST -
AP Liquor Scam : జైలు నుంచి విడుదలైన లిక్కర్ కేసు నిందితులు
AP Liquor Scam : ఆంధ్రప్రదేశ్లో సంచలనానికి కారణమైన లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులు విజయవాడ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. నిన్న విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు తీర్పు మేరకు వీరికి బెయిల్ మంజూరైంది.
Date : 07-09-2025 - 10:12 IST