HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >No Door Delivery Of Ration For 1000 Families On Andhra Odisha Border

Andhra-Odisha Border: రేషన్‌.. పరేషాన్‌..! అర్ధాకలితో అడవిబిడ్డలు!

వాళ్లంతా అడవి బిడ్డలు.. రెక్కాడితే కానీ డొక్కాడదు. అడవిపై ఆధారపడి జీవిస్తుంటారు.

  • Author : Balu J Date : 10-06-2022 - 11:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ration
Ration

వాళ్లంతా అడవి బిడ్డలు.. రెక్కాడితే కానీ డొక్కాడదు. అడవిపై ఆధారపడి జీవిస్తుంటారు. ఒక్క పూట కూడా పని దొరక్కపోతే కుటుంబమంతా పస్తులుండాల్సిన పరిస్థితులు. ములిగే నక్కపై తాటికాయ పడ్డట్టు.. ఇప్పటికే ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న అడవిబిడ్డలకు ప్రభుత్వం అందించే రేషన్ అందడం లేదు. కేవలం రోడ్డు సౌకర్యం లేదనే సాకుతో రేషన్ సరఫరా చేయడం లేదు. దీంతో అడవిబిడ్డలు అన్నామో రామచంద్రా అంటూ ఆకలితో అలమటిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పిడిఎస్) రేషన్‌ను లబ్ధిదారుల ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేస్తున్నప్పటికీ ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (AOB)లోని కొన్ని కొండలపై ఉన్న గ్రామాలకు రహదారి కనెక్టివిటీ లేకపోవడం వల్ల రేషన్ పొందడం లేదు. పార్వతీపురంలోని సాలూరు మండలంలోని మూడు కొండలపైన గ్రామాల్లోని 1,050 కుటుంబాలకు గత ఐదు నెలలుగా రేషన్‌ అందడం లేదు. ముందుగా గ్రామాలకు రేషన్‌ సరఫరా చేసేందుకు ఐటీడీఏ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినా నిధుల కొరత కారణంగా సరఫరా చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. కొండపైన వివిధ గ్రామాలకు చెందిన గిరిజనులు రేషన్ పొందేందుకు మైదాన ప్రాంతంలోని పక్క గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా సాలూరు మండలంలోని కొదమ, చింతమల, సిరివర గ్రామాల ప్రజలు రేషన్‌ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వీళ్లంతా AP వాసులు అయినప్పటికీ, సాలూరు నుండి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల ప్రధాన కార్యాలయం నుంచి రహదారి కనెక్టివిటీ లేదు. అయితే, ఈ గ్రామాలకు ఒడిశా వైపు నుండి నారాయణపట్నం మీదుగా రోడ్డు కనెక్టివిటీ ఉంది. అది సాలూరు నుండి 130 కిమీ కంటే ఎక్కువ దూరంలో ఉంది. పథకం ప్రారంభించిన నాటి నుంచి ప్రతి నెలా రేషన్ పంపేందుకు ప్రత్యేక వాహనాలను అద్దెకు తీసుకుని కొండపైన గ్రామాల్లో పథకాన్ని అమలు చేసేందుకు ఐటీడీఏ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఐటీడీఏ పీఓ ఆర్‌ కురంనాథ్‌ హామీ మేరకు కొండపైన ఉన్న గ్రామాల్లో రేషన్‌ పంపిణీ చేసేందుకు పౌరసరఫరాలతోపాటు స్థానిక రెవెన్యూ అధికారులు వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. అయితే తొమ్మిది నెలలుగా రూ.4 లక్షల బిల్లు క్లియర్ చేయడంలో ఐటీడీఏ అధికారులు విఫలమయ్యారు. దీంతో ఫిబ్రవరిలో రేషన్ డోర్ డెలివరీ నిలిచిపోయింది.

రెండు రాష్ట్రాల బార్డర్ లోని కొదమ గ్రామానికి చెందిన మాలతి దొర అనే లబ్ధిదారు మాట్లాడుతూ.. “మూడు గ్రామాల్లో 1,043 మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. అంతకుముందు అధికారులు ప్రతినెలా ప్రత్యేక వాహనాల్లో ఒడిశా మార్గం ద్వారా రేషన్ పంపేవారు. అయితే ఫిబ్రవరి నుంచి రేషన్ పంపడం మానేశారు. గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు లేనందున చాలా మంది ప్రభుత్వ రేషన్‌పై ఆధారపడతారు. గ్రామానికి రేషన్ పంపాలని ఐటీడీఏతోపాటు జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. పార్వతీపురం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి ప్రత్యేక వాహనాల్లో కొండపైనున్న గ్రామాలకు ఫిబ్రవరి వరకు రేషన్‌ పంపాం. ప్రభుత్వం 4 లక్షలు క్లియర్ చేయాల్సి ఉంది. మేం సమస్యను మా ఉన్నతాధికారులకు తెలియజేశాం. త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాను’ అని ఇన్‌చార్జి తహసీల్దాహర్ చంద్రశేఖర్ తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP CM Jagan
  • ap ration
  • door delivery

Related News

Massive public meeting on the alliance's two-year rule

Chandrababu Naidu: కూటమి రెండేళ్ళ పాలనపై భారీ బహిరంగ సభ

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శుక్రవారంతో రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, గత వైసీపీ ప్రభుత్వం మిగిల్చి వెళ్లిన సవాళ్లు, సంక్షోభాలను అధిగమించి, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా చంద్రబాబు తన అభిప్రాయాలను పంచుకున్నా

  • Zomato gets Rs 9.6 crore GST demand from Andhra Pradesh

    Zomato: జొమాటో కు షాక్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 9.6 కోట్ల జీఎస్‌టీ నోటీసు

  • That is the very day the 'Thalliki Vandanam' money gets credited!

    Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే!

  • Centre sanctions massive funds for AP: Union Minister Pemmasani Chandra Sekhar

    Pemmasani Chandra Sekhar: ఏపీకి కేంద్రం భారీగా నిధులు మంజూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

  • Central government showering blessings on Amaravati

    Amaravati: అమరావతికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు

Latest News

  • High Court: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు హైకోర్టు 50 వేల జరిమానా

  • Endowments Department: దేవాదాయ శాఖలో ప్రమోషన్లు.. ఈవోలకు గ్రేడ్‌‌-1గా ప్రమోషన్లు

  • Visakhapatnam Steel Plant: వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ అధికారులపై సీరియస్

  • Venkateswara Suprabhatam: వేంకటేశ్వర సుప్రభాతం చరిత్ర తెలుసా?

  • Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd