Mulugu: మాజీ సర్పంచ్ను హత్య చేసిన మావోయిస్టులు
- By hashtagu Published Date - 12:29 PM, Wed - 22 December 21
నిన్నటి రోజున ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలానికి చెందిన కుర్సం రమేష్ను మావోయిస్ట్ లు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. నిన్న కిడ్నాప్ చేసిని మాజీ సర్పంచ్ రమేష్ ను హత్య చేశారు మావోయిస్టులు. మావోయిస్టులను మోసం చేసేలా వ్యవహరించాడని.. అందుకే రమేష్ ను చంపినట్లు లేఖ విడుదల చేశారు మావోయిస్టులు.
తమ సమాచారం… పోలీసులకు రమేష్ అందించారని.. మావోయిస్ట్ పార్టీకి తీరని ద్రోహం చేశారని లేఖ లో పేర్కొన్నారు. అందుకే తాము రమేష్ ను హత్య చేసినట్లు స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరిగితే.. వారిని కూడా శిక్షిస్తామని హెచ్చరించారు. కాగా.. వృత్తి రీత్యా రమేష్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. రమేష్ మృతి తో ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.
Related News
Hyderabad – June 2 : జూన్ 2 నుంచి తెలంగాణదే హైదరాబాద్.. సీఎం రేవంత్ కసరత్తు
ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక తయారు చేయాలని అధికారులను రేవంత్రెడ్డి ఆదేశించారు.