Lok Sabha Elections 2024: ములుగు జిల్లాలో 144 సెక్షన్ విధిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ
1.05.2024 సాయంత్రం 4.00 గంటల నుంచి 14.05.2024 సాయంత్రం 4.00 గంటల వరకు లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ములుగు జిల్లా వ్యాప్తంగా ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడడాన్ని నిషేధించారు.
- Author : Praveen Aluthuru
Date : 11-05-2024 - 7:17 IST
Published By : Hashtagu Telugu Desk
Lok Sabha Elections 2024: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు . ములుగు జిల్లాను పరిరక్షించేందుకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు 11.05.2024 సాయంత్రం 4.00 గంటల నుంచి 14.05.2024 సాయంత్రం 4.00 గంటల వరకు లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ములుగు జిల్లా వ్యాప్తంగా ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడడాన్ని నిషేధించారు.
సెక్షన్ 144 అమలులో, చట్టవిరుద్ధంగా సమావేశాలు మరియు బహిరంగ సభలు నిర్వహించడంపై పూర్తి నిషేధం ఉంటుందని పేర్కొంది. ఈ ఉత్తర్వులను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
Also Read: KTR: బీఆర్ఎస్ కార్యకర్త ఇంట్లో కేటీఆర్ భోజనం.. ఫొటోలు వైరల్