Tamil Nadu: తమిళనాడు మద్యం ప్రియులకు చేదు వార్త
తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ త్వరలో తమ ఔట్లెట్ల ద్వారా విక్రయించే మద్యం ధరలను ఒక్కో బాటిల్పై రూ.5 నుంచి రూ.50 వరకు పెంచాలని యోచిస్తోంది.
- By Praveen Aluthuru Published Date - 07:12 AM, Mon - 2 October 23

Tamil Nadu: తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ త్వరలో తమ ఔట్లెట్ల ద్వారా విక్రయించే మద్యం ధరలను ఒక్కో బాటిల్పై రూ.5 నుంచి రూ.50 వరకు పెంచాలని యోచిస్తోంది. రాష్ట్రంలోని ఏకైక మద్యం విక్రయదారుడు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా 500 ఔట్లెట్లు మూతపడడం వల్ల ఆదాయం తగ్గడంతో దాన్ని భర్తీ చేసేందుకు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2022లో చివరి సారిగా ధరలను పెంచారు. ఈసారి కార్పొరేషన్ ఒక బాటిల్కు రూ. 5 నుండి రూ. 50 వరకు పెంచాలని ఆలోచిస్తోందని సీనియర్ అధికారి చెప్పారు.
రమ్, విస్కీ, బ్రాందీ మరియు జిన్ (180 మి.లీ)లకు రూ. 5, మరియు 375 మి.లీ మరియు 750 మి.లీ బాటిళ్లకు వరుసగా రూ.10 మరియు రూ.20 పెంచారు. అదనంగా, బీర్ ధరలు బాటిల్కు రూ. 10 పెరగవచ్చు, అయితే మీడియం మరియు ప్రీమియం బ్రాండ్లు యూనిట్కు రూ. 10 నుండి రూ. 50 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ పెంపు ద్వారా ప్రభుత్వం అదనంగా రూ.1,500 కోట్లు సంపాదించవచ్చు. గత ఆర్థిక సంవత్సరం 2022-23లో కార్పొరేషన్ ఆదాయం రూ. 45,000 కోట్లుగా ఉంది అని ఒక అధికారి తెలిపారు.
Also Read: Hyundai Exter Micro SUV : ఆ కారు కావాలంటే 9 నెలలు వెయిట్ చేయాల్సిందే..!