RBI: రూ.2 వేల నోట్లను రద్దు చేయడానికి కారణం ఇదేనా.?.
ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఇక నుంచి లీగల్ టెండర్గానే రూ.2 వేల నోట్లు కొనసాగనున్నాయి. రూ.2 వేల నోట్లను మే 23 నుంచి మార్చుకోవాలని సూచించింది.
- By Nakshatra Published Date - 08:31 PM, Fri - 19 May 23
RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఇక నుంచి లీగల్ టెండర్గానే రూ.2 వేల నోట్లు కొనసాగనున్నాయి. రూ.2 వేల నోట్లను మే 23 నుంచి మార్చుకోవాలని సూచించింది. బ్యాంకులో డిపాజిట్ చేయడం లేదా బ్యాంకులో రూ.2 వేల నోట్లు ఇచ్చి వేరే నోట్లు తీసుకోవడం చేయాలని సూచించింది. సెప్టెంబర్ 30లోగా రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.
నేటి నుంచి రూ.2 వేల సర్కూలేషన్ ను నిలిపివేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అయితే ఇంత సడెన్ గా రూ.2 వేల నోట్లను రద్దు చేయడంతో అందరూ షాక్ కు గురవుతున్నారు. 2018 మార్చి 31 నాటికి 6.7 లక్షల కోట్ల రూ.2 వేల నోట్లు చలామణిలో ఉంటే ఇప్పుడు 10.8 శాతం మాత్రమే మార్కెట్ లో ఉన్నాయని ఆర్బీఐ చెబుతోంది. లావాదేవీలకు ఈ నోట్లను వాడటం లేదని గుర్తించినట్లు వెల్లడించింది. ఈ కారణాలతో క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2 వేల నోట్లను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది.
అయితే రూ.2 వేల నోట్ల ప్రింటింగ్ను ఆర్బీఐ ఎప్పుడో నిలిపివేసింది. గత నాలుగు సంవత్సరాలుగా రూ.2 వేల నోట్లను ఆర్బీఐ నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పార్లమెంట్ లో కూడా ప్రకటించింది. నోట్ల ప్రింటింగ్ ను ఆపేయడంతో రూ.2 వేల నోట్లను రద్దు చేస్తారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. బ్యాంకులు, బ్యాంకు ఏటీఎంలలో కూడా రూ.2 వేల నోట్లు ఎక్కడా కనిపించడం లేదు. రూ.2 వేల నోట్ల చలామణి బాగా తగ్గిపోయింది. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ దెబ్బతినడం, ఈ ఏడాదిలో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రూ.2 వేల నోట్లను రద్దు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
Tags
Related News
RBI New Rule: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మీ బ్యాంక్ అకౌంట్లో మైనస్ బ్యాలెన్స్ ఉన్నాయా..?
బ్యాంకులకు సంబంధించిన పనులు పూర్తి చేసేందుకు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఒకప్పుడు ఉండేది.