Rohit Sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్
- By Prasad Published Date - 08:10 AM, Sun - 26 June 22
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా సోకింది. ఇంగ్లాండ్ తో మరికొద్ది రోజుల్లో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ సమయంలో రోహిత్ కు కరోనా పాజిటివ్ గా తేలడంతో జట్టులో ఆందోళన మొదలైంది. రోహిత్ కరోనా పాజిటివ్ అని బీసీసీఐ అధికారిక ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపింది. శనివారం జరిపిన ర్యాపిడ్ యాంటీజన్ టెస్ట్లో రోహిత్ శర్మకు కొవిడ్ పాజిటివ్ అని తెలిసింది. ప్రస్తుతం హోటల్లో ఐసోలేషన్లో ఉన్నాడని.. మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. జులై 1 నుంచి బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్తో నిర్ణయాత్మక టెస్ట్ మ్యాచ్కు ముందు 4 రోజుల టూర్ గేమ్లో లీసెస్టర్షైర్తో తలపడుతున్న జట్టులో రోహిత్ శర్మ కెప్టెన్ గా ఆడాల్సి ఉంది. వార్మప్ మ్యాచ్లో భాగంగా గురువారం జరిగిన తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన రోహిత్, శనివారం భారత్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు రాలేదు. ఇన్నింగ్స్లో ఔటయ్యే ముందు అతను 25 పరుగులు మాత్రమే నమోదు చేశాడు.
Related News
Team India: 2024 టీ20 ప్రపంచకప్.. టీమిండియా జట్టు ఇదేనా..?
2024 ఐసీసీ T20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ఎప్పుడైనా ప్రకటించవచ్చు.