Vandalism of Durga Idol : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అమ్మవారి విగ్రహం ధ్వంసం
Destruction of Durga Idol : ప్రపంచంలోనే అత్యంత పూజ్యమైన అమ్మవారి విగ్రహం గత అర్ధరాత్రి ధ్వంసమైన విషయం స్థానికుల కంటపడింది. ఈ విషయాన్ని వెంటనే నిర్వాహకులకు సమాచారమిచ్చారు. దీంతో, హిందూ సంఘాల నేతలు, భక్తులు సంఘీభావంగా అక్కడ చేరుకోవడం ప్రారంభించారు. ఈ ఘటనపై పోలీసులు తక్షణ చర్య తీసుకోవడంతో, బేగంబజార్ పోలీసులు అక్కడ చేరుకున్నారు. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్ సహా ఇతర పోలీస్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
- Author : Kavya Krishna
Date : 11-10-2024 - 11:07 IST
Published By : Hashtagu Telugu Desk
Vandalism of Durga Idol : హైదరాబాద్ నగరంలో శనివారం రాత్రి హిందూ భక్తుల ఆగ్రహానికి కారణమయిన ఘటనే చోటుచేసుకుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో దేవి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ప్రపంచంలోనే అత్యంత పూజ్యమైన అమ్మవారి విగ్రహం గత అర్ధరాత్రి ధ్వంసమైన విషయం స్థానికుల కంట పడింది. ఈ విషయాన్ని వెంటనే నిర్వాహకులకు సమాచారమిచ్చారు. దీంతో, హిందూ సంఘాల నేతలు, భక్తులు సంఘీభావంగా అక్కడ చేరుకోవడం ప్రారంభించారు. ఈ ఘటనపై పోలీసులు తక్షణ చర్య తీసుకోవడంతో, బేగంబజార్ పోలీసులు అక్కడ చేరుకున్నారు. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్ సహా ఇతర పోలీస్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
దుండగులు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోకి ప్రవేశించినప్పుడు మొదట విద్యుత్ సరఫరాను నిలిపివేశారు, ఆపై సీసీ కెమెరాలను పగులగొట్టారు. అనంతరం అమ్మవారి చేతిని విరగ్గొట్టి, అక్కడ ఉన్న పూజ సామగ్రిని చెల్లాచెదురుగా విసిరేశారు. ఈ ఘటనకు సంబంధించిన బ్యారికేడ్లను కూడా తొలగించారు. ఈ సంఘటనపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. “మనం హిందూ దేశంలో ఉన్నామా లేక ఇస్లామిక్ దేశంలో ఉన్నామా?” అని వారు ప్రశ్నిస్తున్నారు.
AP Heavy Rains : ఏపీ ప్రజలకు పిడుగు లాంటి వార్త..
అయితే.. నిన్న రాత్రి సద్దుల బతుకమ్మ సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన దండియా ప్రోగ్రాం ముగిసేవరకు అక్కడ పోలీసులు మానిటర్ చేశారు. అర్ధరాత్రి సమయంలో దుండగులు ఆరు దాడి చేశారు. ముందుగా కరెంట్ కట్ చేసి, సీసీ కెమెరాలను ధ్వంసించిన అనంతరం అమ్మవారి విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకొని చేతిని విరగ్గొట్టారు. అలాగే, పూజ సామాగ్రిని చెల్లాచెదురుగా విసిరారు. దుండగులు అమ్మవారి చుట్టూ ఉన్న బ్యారికేడ్లను కూడా తొలిగించారు. ఘటన స్థలానికి చేరుకున్న అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్, అక్కడ జరిగిన పరిస్థితిని సమీక్షించి కేసు నమోదు చేశారు. బేగంబజార్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ప్రతి సంవత్సరం ఈ విధమైన దాడులు జరిగిపోతున్నాయని, భక్తులు తీవ్ర ఆవేదనతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ ఆరాధ్య విగ్రహాలపై జరగుతున్న ఈ దాడులను అరికట్టాలన్న ఉద్దేశంతో పలు
హిందూ సంఘాలు, దుండగులను పట్టుకోవడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Saddula Bathukamma : వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా ‘లేజర్ లైట్ షో’