AP : ఏపీ మహిళలకు శుభవార్త.. ఇకపై వారికి నెలకు రూ 1500.. !
ఇందులో భాగంగా ఏడాదికి రూ. 18,000 మహిళల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు సమాచారం. ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికై రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,300 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించింది. దీనివల్ల లక్షలాది మంది మహిళలకు ఆర్థిక స్వావలంబన పెరిగి వారి జీవన స్థాయి మెరుగవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
- Author : Latha Suma
Date : 16-06-2025 - 11:54 IST
Published By : Hashtagu Telugu Desk
AP : ఆంధ్రప్రదేశ్ మహిళల కోసం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శుభవార్తను ప్రకటించింది. సూపర్ సిక్స్ లో భాగంగా ముఖ్యమైన “ఆడబిడ్డ నిధి” పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలనెలా రూ. 1,500 చొప్పున నగదు సహాయాన్ని అందించనున్నారు. ఇందులో భాగంగా ఏడాదికి రూ. 18,000 మహిళల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు సమాచారం. ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికై రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,300 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించింది. దీనివల్ల లక్షలాది మంది మహిళలకు ఆర్థిక స్వావలంబన పెరిగి వారి జీవన స్థాయి మెరుగవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: KTR : ఇప్పటికి మూడు సార్లు పిలిచారు.. 30 సార్లు పిలిచినా విచారణకు వస్తా: కేటీఆర్
ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ కూడా సిద్ధంగా ఉండబోతోందని సమాచారం. అర్హత కలిగిన మహిళలు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించుకోవచ్చు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, మొదటి విడతగా లక్షలాది మంది మహిళలు ఈ పథకం లబ్దిదారులుగా ఎంపిక కాబోతున్నారు. ఇదే కాకుండా, ప్రభుత్వం “ఆడబిడ్డ నిధి” పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని, ప్రతి రూపాయి లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా జమ కావాలన్న ఉద్దేశంతో ప్రత్యేక మోనిటరింగ్ వ్యవస్థను ఏర్పాటుచేయనుంది. గ్రామీణ ప్రాంతాలలో ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టనున్నారు. స్థానిక వలంటీర్లు, మహిళా సంఘాల మద్దతుతో పథకాన్ని గ్రామ స్థాయిలో విజయం సాధించేలా చూస్తున్నారు.
ఈ పథకంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళల్లో హర్షాతిరేకం నెలకొంది. ఇప్పటికే చాలా మంది మహిళలు తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజంగా మమ్మల్ని గుర్తించిన పథకంఇది ఆర్థికంగా వెనుకబడి ఉన్న మమ్మల్ని కొంతవరకు ముందుకు నడిపించే పథకం అంటూ మహిళలు ఆనందంగా స్పందిస్తున్నారు. ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో మహిళల కోసం ఇలాంటి పథకాలు రావడం అరుదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ పథకం ద్వారా మహిళల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చిందని సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి విశేష స్పందన లభిస్తుందని అంచనా. మొత్తానికి, ఆంధ్రప్రదేశ్ మహిళలకు ‘‘ఆడబిడ్డ నిధి’’ రూపంలో ప్రభుత్వం ఇచ్చిన ఈ బహుమతి, వారి జీవితాల్లో ఆర్థిక భద్రత కలిగించేందుకు తొలి అడుగుగా నిలవనుంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఇది అత్యంత ప్రజాప్రాధాన్యత కలిగిన హామీగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.