Fire Accident : ఢిల్లీలోని పూత్ ఖుర్ద్లో అగ్రిప్రమాదం.. ఓ గోడౌన్లో చెలరేగిన మంటలు
ఢిల్లీలోని పూత్ ఖుర్ద్ ప్రాంతంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల గోడౌన్లో సోమవారం రాత్రి మంటలు చెలరేగాయి. సోమవారం రాత్రి 9:45
- Author : Prasad
Date : 23-05-2023 - 6:33 IST
Published By : Hashtagu Telugu Desk
ఢిల్లీలోని పూత్ ఖుర్ద్ ప్రాంతంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల గోడౌన్లో సోమవారం రాత్రి మంటలు చెలరేగాయి. సోమవారం రాత్రి 9:45 గంటలకు మంటలు చెలరేగాయని అగ్నిమాపక అధికారి తెలిపారు.ఈ అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే 12 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.ఇది ఒకే అంతస్థు కలిగిన భవనమని.. అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని అధికారులు తెలిపారు.