Tirumala Darshan Tickets : 2024 ఫిబ్రవరి తిరుమల దర్శన టికెట్స్ లేటెస్ట్ అప్డేట్..
తిరుమల (Tirumala) ఆలయాన్ని రోజుకు చాలా మంది యాత్రికులు సందర్శిస్తారు. తిరుమల ఆలయానికి వచ్చే యాత్రికులు దర్శనం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.
- By Vamsi Chowdary Korata Published Date - 10:56 AM, Fri - 17 November 23
Tirumala Darshan Tickets Latest Update : తిరుమల ఆలయాన్ని రోజుకు చాలా మంది యాత్రికులు సందర్శిస్తారు. తిరుమల ఆలయానికి వచ్చే యాత్రికులు దర్శనం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. యాత్రికుల ప్రధాన సమస్య దర్శనం కోసం టిక్కెట్లు అందుబాటులో లేకపోవడమే. యాత్రికులు భగవంతుని దర్శనం కోసం 3 నెలల ముందు దర్శన టిక్కెట్ల కోసం బుక్ చేసుకోవాలి. యాత్రికులు ఆన్లైన్లో టిక్కెట్ల కోసం బుక్ చేయలేకపోతే, వారు ఆలయానికి వచ్చి ఎక్కువ సమయం గడిపి స్వామి వారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ప్రతి నెల పలు సేవలకు సంబదించిన టికెట్స్ ను ఆన్లైన్ లో టీటీడీ వారు అందుబాటులో ఉంచుతారు. ఫిబ్రవరి 2024 సంబదించిన టికెట్స్ ను అందుబాటులో ఉంచబోతున్నారు.
We’re Now on WhatsApp. Click to Join.
తాజాగా వైకుంఠ ద్వారకా దర్శన టికెట్స్ కు సంబంధించి అప్డేట్ ను విడుదల చేసారు. డిసెంబర్ 23 నుండి జనవరి 1 వరకు వైకుంఠ ద్వారకా దర్శన టికెట్స్ ను ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు అందుబాటులో ఉంచబోతున్నారు. ఈ టికెట్స్ కోసం @tirupatitirumalainfo క్లిక్ చేయండి.
అలాగే ఫిబ్రవరి నెలకు సంబదించిన తిరుమల (Tirumala) ఆర్జిత సేవ టికెట్స్ కోసం నవంబర్ 21 ఉదయం 10 గంటలకు @tirupatitirumalainfo క్లిక్ చేయండి. అలాగే ఫిబ్రవరి లో స్వామి ప్రత్యేక దర్శన టికెట్స్ కోసం నవంబర్ 21 మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండనున్నాయి.
ఫిబ్రవరి కి సంబదించిన తిరుమల (Tirumala) అంగప్రదక్షిణ టికెట్స్ నవంబర్ 23 ఉదయం 10 గంటలకు @tirupatitirumalainfo అందుబాటులో ఉండనున్నాయి. రూ.300 దర్శనం టిక్కెట్లు ఫిబ్రవరి 2024 నెలలో 25-26 నవంబర్ 2023న విడుదల చేయబడతాయి.
Also Read: Tulsi Leaves Benefits: తులసి ఆకులలో అనేక ఔషధ గుణాలు.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇదొక దివ్యౌషధం..!
Related News
TTD: 2024 మే 16న తిరుపతిలో వార్షిక ఉత్సవాలు ప్రారంభం
TTD: తిరుపతి శ్రీగోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం 8.15 గంటల నుంచి 8.40 గంటల వరకు పవిత్ర మిథున లగ్నంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలు, సంగీత వాయిద్యాల మధ్య గరుడ ధ్వజపథం ఎగురవేయడంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. పూర్వం శ్రీ గోవిందరాజస్వామి, గరుడ ధ్వజపథం, చక్రత్తాళ్వార్, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో ప్రదక్షిణలు చేశారు. ఉదయం ఉత్సవ దేవతలకు స్నపన �